మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా మూవీతో అరవిందస్వామి అమ్మాయి గుండెల్లో నిద్రపోయాడనే చెప్పాలి. తరువాత అరవిందస్వామి తన మూవీలకి సంబంధించిన ప్లానింగ్ విషయంలో కొంత అశ్రద్ధ చూపటంతో…వరుస సినిమాలు తనకి ప్లాపులని ఇచ్చాయి. దీంతో కొంత కాలం ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చాడు. సొంతగా చేసుకుంటున్న బిజినెస్ ల మినహా…సినిమాలకి సంబంధించి ఎటువంటి విషయంలోనూ అరవిందస్వామి ఆసక్తి చూపలేదు.


ఇక మూవీలకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ కి సైతం అరవిందస్వామి దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే కోలీవుడ్ లో వచ్చిన తనిఒరువన్ మూవీతో అరవిందస్వామి కి విశేష ఆధరణ పెరిగింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టైలిష్ విలన్ గా పేరుతెచ్చుకున్నాడు. దీంతో ఇండస్ట్రీకి చెందిన టాప్ డైరెక్టర్స్ అంతా అరవిందస్వామి డేట్స్ కోసం క్యూలు కట్టాల్సిన వచ్చింది.


ఇదిలా ఉంటే తాజాగా అరవిందస్వామి హీరోగా ఓ కథ సిద్ధం అవుతుంది. ఇందులో హీరోయిన్ గా దాదాపు త్రిషని కన్ఫర్మ్ చేశారు. దర్శకుడు హెచ్.వినోద్ చదురంగ వేట్టై చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా త్రిషని కన్ఫర్మ్ చేశారనే న్యూస్ అంతటా వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన న్యూస్ బయటకు రానుంది. అలాగే త్రిషతో మరో రొమాంటిక్ సబ్జెక్ట్ లోనూ అరవిందస్వామి నటించనున్నారు.


అందులో వీరిద్దరి కాంబినేషన్ లో ఫుల్ రొమాన్స్ ఉండనుందని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ ఫోటోషూట్ సైతం జరిగిందనే టాక్స్ బయటకు వచ్చాయి. ఇక ఆ ఫోటో షూట్ లో అరవిందస్వామి ని టాప్ హీరోయిన్ త్రిష ముద్దులతో ముంచెత్తిందని అంటున్నారు. కథా బలమున్న కథాంశం కావటంతో…ఈ తరహా రొమాన్స్ చాలా కామన్ అని త్రిష చెప్పటం విశేషం. మొత్తంగా త్రిష, అరవిందస్వామి కాంబినేషన్ లో రెండు చిత్రాలు రానున్నాయనే న్యూస్ కోలీవుడ్ లో చర్ఛనీయాంశంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: