రాజమౌళి మహేష్ లతో కలిసి సినిమా చేస్తే చూడాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న అభిమానులకు మహేష్ రాజమౌళిని కార్నర్ చేస్తూ తీసుకున్న నిర్ణయం షాకింగ్ న్యూస్ గా మారింది.  మహేష్ మరగాదాస్ ల సినిమాకు సంబంధించి ఒక ఆ శక్తికర కథనాన్ని ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఈరోజు చాల ప్రముఖంగా ప్రచురించింది. 
ఆ దినపత్రిక కథనం ప్రకారం మహేష్ తన ‘పోకిరి’ సెంటిమెంట్ ను రిపీట్ చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.  మురగదాస్ మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీని వచ్చే సంవత్సరం ఏప్రియల్ 28న విడుదల చేయడానికి ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.  

2006 ఏప్రియల్ 28న ‘పోకిరి’ విడుదలైన నేపధ్యంలో అదే డేట్ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ 2017 ఏప్రియల్ 28 డేట్ మహేష్ జాతక రీత్యా కూడ బాగుoటుంది అన్న అభిప్రాయం ఏర్పడటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇంత ముందుగానే నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే ఇప్పటికే ‘బాహుబలి 2’ రిలీజ్ డేట్ ను ఏప్రియల్ 28గా ఖరార్ చేస్తూ కరణ్ జోహార్ తో పాటు రాజమౌళి కూడ అధికారికంగా ప్రకటించిన నేపధ్యంలో మహేష్ ఇంత సాహసం ఎందుకు చేస్తున్నాడు అంటూ అప్పుడే కామెంట్స్ మొదలయ్యాయి. 

గత సంవత్సరం కూడ ఇలాగే ‘బాహుబలి’ కి ‘శ్రీమంతుడు’ కి మధ్య డేట్స్ వార్ జరిగినప్పుడు ‘బాహుబలి’ కోసం మహేష్ తన ‘శ్రీమంతుడు’ ని వెనక్కి జరిపి రాజమౌళికి సహకరించాడు.  ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాజమౌళి మహేష్ కు లైన్ క్లియర్ చేస్తాదా ? లేదంటే మళ్ళీ మహేష్ రాజమౌళి కోసం మరో త్యాగం చేస్తాడా అన్న అనుమానం ఈ జాతీయపత్రిక ప్రచురించిన వార్తను చదివిన వారికి కలుగుతుంది.

ఇప్పటికే ‘బ్రహ్మోత్సవం’ షాక్ లో ఉన్న మహేష్ రాజమౌళితో ఢి కొట్టే సాహసం మురగదాస్ ను నమ్ముకుని చేయగలుగుతాడా అన్న సందేహం మహేష్ అభిమానులకు కూడ కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.  

ఇప్పటికే వచ్చే సంవత్సరం టాలీవుడ్ టాప్ పొజిషన్స్ ను డిసైడ్ చేసే సినిమాలుగా అంచనా వేయబడుతున్న ‘బాహుబలి 2’ మహేష్ మురగదాస్ ల మూవీలు కేవలం ఒక్క సెంటిమెంట్ ను నమ్ముకుని ఒకదాని పై ఒకటి పోటీ పడటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు అన్న కామెంట్స్ అప్పుడే మొదలైపోయాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: