గత ఐదు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ప్రజా జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరబాద్ లో అయితే కొన్ని చోట్ల చెరువులను తలపిస్తున్నాయి..మూడు నాలుగు రోజుల నుంచి ఇండ్లల్లోంచి బయటకు రాలేని పరిస్థితిలో ప్రజలు పడే ఇబ్బందులు సోషల్ నెట్ వర్క్ లో దుమ్మురేపుతున్నాయి. టీవి చానల్స్ పోటీ పడీ మరీ ప్రజల పడుతున్న భాదలు లైవ్ గా చూపిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
Image result for hyderabad rain problems
మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం అయ్యారు. ఇప్పటికే సైనిక సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఇప్పుడు చిత్ర పరిశ్రమ కూడా సహాయ కార్యక్రమానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా రానా, మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్, మంచు లక్ష్మి లాంటి సినీ ఆర్టిస్టులు హైద్రాబాద్ లో వర్ష బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. గతంలో తమిళనాడులో వరదలు వచ్చినపుడు కూడా వీరు తమ వంతు సహాయంగా ప్రజల్లోకి వెళ్లి విరాళాలు సేకరించి మరీ తమిళనాడు బాధితులకు తమ చేయూత అందించారు.
Image result for hyderabad rain problems
కొన్ని ప్రాంతలైతే పూర్తిగా నీటిలో మునిగిపోయాయి తాగడానికి మంచి నీళ్ళు , పాలు కూడా దొరకడం లేదు దాంతో దగ్గుబాటి రానా,మంచు లక్ష్మి , మంచు మనోజ్ , సాయి ధరం తేజ్సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించు కోవడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఆహార పదార్థాల తో పాటు పాలు ,బిస్కెట్లు పంపిణీ చేయించారు. అంతే కాదు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ అవుతూ పలువురు సినీ ప్రముఖులను సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. 

Image result for tamil nadu floods help tollywood actors

Image result for rana manchu manoj


మరింత సమాచారం తెలుసుకోండి: