టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ది కాస్త డిఫరెంట్ స్టైల్. ఏది చేసినా కాస్త కొత్తగా, రిచ్ గా ఉండేలా చేస్తాడాయన. పూరి జగన్నాథ్ ఓ కథని ఫైనల్ చేసేటప్పుడు దాదాపు ప్రపంచానికి దూరంగా ఉంటాడు. కనీసం మొబైల్ సైతం ఆ సమయంలో అందుబాటులో లేకుండా చూసుకుంటాడు. ఈ విధంగా సినిమా కథపై తను పూర్తి నిబద్ధతతో పనిచేస్తుంటాడు. ఇలాంటి పూరి జగన్నాథ్ గతంలో మెగాస్టార్ చిరంజీవితో సినిమాని ఓకె చేయించుకున్నాడు.


కానీ అనుకోని విధంగా ఆటో జానీ మరుగున పడింది. ఫస్టాఫ్ బాగుంది..సెకండ్ ఆఫ్ బాగోలేదంటూ చిరంజీవి ఓపెన్ గా కామెంట్ చేయటం…ఇది పూరి జగన్నాథ్ మనస్సుని గుచ్చింది. దీంతో పూరి జగన్నాథ్ సైతం తరువాత చిరంజీవిని కలిసే ప్రయత్నం చేయలేదని ఇండస్ట్రీ నుండి తెలుస్తున్న సమాచారం. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ తాజాగా ఆటోజాని కథని మరోసారి తెరపైకి తీసుకువచ్చాడని అంటున్నారు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తో పూరి జగన్నాథ్ స్టోరీ సిట్టింగ్ వేయనున్నారు.


ఇందులో జూనియర్ కోసం ప్రత్యేకంగా రాసిన కథలో పాటు…ఆటోజాని కథ కూడ ప్రస్థావనకి తీసుకురావాలని భావిస్తున్నాడు. మెగాస్టార్ కోసం రెడీ చేసిన కథలో కొద్దిపాటు మార్పులు చేసి జూనియర్ నటించినప్పటికీ…ఆ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంటుందనేవి పూరి జగన్నాథ్ ఆలోచన. ఈ విషయాన్ని ఇప్పటికే జూనియర్ కి పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడని అంటున్నారు. మొత్తంగా ఆటోజాని కథని జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్నాడంటే ఈ మూవీపై భారీ అంచనాలే పెరిగే అవకాశం ఉంది.


ఎందుకంటే మెగాస్టార్ కథంటే పూరీ కచ్ఛితంగా ఎన్నో జాగ్రత్తలను తీసుకొని రాసి ఉంటాడు. అందుకే ఆ కథలో బలం ఉంటుందనేది అందరి నమ్మకం. ఒకవేళ పూరి జగన్నాథ్ చెప్పే మెగాస్టార్ సినిమా కథని కాకుండా ఎన్టీఆర్ కొత్త కథని ఒప్పుకున్నప్పటికీ…వీరిద్దరి కాంబినేషన్ ఈసారి బాక్సాపీస్ ని ఓ ఊపు ఊపనుందని అంటున్నారు. ఏదిఏమైనా పూరి జగన్నాథ్, మెగాస్టార్ కోసం రెడీ చేసిన ఆటోజాని కథని…ఆ స్టోరీకి తగ్గ కథానాయుడుతో సెట్స్ మీదకు తీసుకువెళ్ళాలనేది పూరీ ఆలోచన.



మరింత సమాచారం తెలుసుకోండి: