నేటితరం ఫిల్మ్ ఇండస్ట్రీలోని టెక్నిషియన్స్, యాక్టర్స్ ఇలా ఎవరైనా సరే…సినిమా అనేది ఓ వ్యాపారంలాగే చూస్తున్నారు. గతంలో సినిమా రంగంలో మంచి సక్సెస్ ని పొంది..ఫైనాన్షియల్ గా బలంగా ఉన్న వారు…సినిమా అంటే ప్రాణం.. అంటూ చెప్పుకొస్తుంటారు. అయితే నేటితరం మాత్రం సినిమాని కేవలం వ్యాపారంతోనే చూస్తున్నారు. ఒకసినిమాలో నాలుగు డబ్బులు సంపాదించుకోగానే…దాన్ని ఖర్చు పెట్టేయకుండా వాటిని జాగ్రత్తగా పొదుపుచేసుకుంటున్నాయి.

గతంలో కొంత మంది తారలు సినిమా ద్వారా వచ్చిన డబ్బులను ఆదా చేయకుండా..ఖర్చు పెట్టుకోవటంతో ఒక దశలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే గతతరం నటుల నుండి నేటతరం నటులు సంపాదన విషయంలో మంచి పద్దలను నేర్చుకున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ కమర్షియల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న డైరెక్టర్ మారుతి…వ్యాపారంలోకి దిగాడని అంటున్నారు.

ఇందుకు హీరో తరుణ్ తనకి ప్రేరణ అని అంటున్నారు. ప్రస్తుతం తరుణ్ కి అవకాశాలు లేనప్పటికీ…తనకి రెస్టారెంట్ తరహా బిజినెస్ లు ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో డైరెక్టర్ మారుతి సైతం ముందుకు వెళుతున్నాడు. ఈ మధ్య కాలంలో మంచి లాభాలను చూసిన మారుతి…తను సంపాదించుకున్న దాంట్లో కొంత మొత్తంతో రెస్టారెంట్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇందుకు బంజారాహిల్స్ ని వేధిక చేసుకున్నారని క్లియర్ టాక్స్ తెలుస్తున్నాయి.

ఇందులోకి హీరో నాని సైతం పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. నాని, మారుతి కాంబినేషన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రం ఇద్దరికి మంచి పేరుని తెచ్చింది. ఈ చిత్రంతోనే నాని మార్కెట్ సైతం భారీగా పెరిగింది. అందుకే వీరిద్దరి భాగస్వామ్యంతో బంజారా హిల్స్ లో ఈ రెస్టారెంట్ బిజినెస్ రానుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మారుతి చేతిలో 4చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒక చిత్రం పెద్ద హీరోతో కాగా…మిగతా చిత్రాలు చిన్నతరహా బడ్జెట్ చిత్రాలు. వెంకటేష్ తో మారుతి చేసిన చిత్రం మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోవటంతో...కొంత మంది పెద్ద హీరోలు మారుతిని దూరంపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హీరో రవితేజ మాత్రం త్వరలోనే మారుతితో ఓ మూవీని చేసే అవకాశం ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: