మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ “ఖైదీ నెం.150”. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు 8 సంవత్సరాల తరువాత మెగాస్టార్ తిరిగి ప్రేక్షకులకి కనిపిస్తున్న చిత్రం ఈ “ఖైదీ నెం.150” కావటంతో, ఈ మూవీపై ఇండస్ట్రీలోనూ…అటు ఫ్యాన్స్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా “ఖైదీ నెం.150” మూవీకి ఇండస్ట్రీలో జరిగే బిజినెస్ ఎంత అనేదానిపై చర్ఛలు జోరుగా జరుగుతున్నాయి.


ఇప్పటి వరకూ నెంబర్ వన్ లో ఉన్న మహేష్ బాబు రికార్డ్స్ ని మెగాస్టార్ చిరంజీవి తన నటిస్తున్న“ఖైదీ నెం.150” మూవీతో తిరిగిరాస్తాడా? అనే విధంగానూ చర్ఛలు జరుగుతున్నయి. ఇదిలాఉంటే మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నెం.150” మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ యాక్టివిటీస్ కోసం ప్రత్యేకమైన టీంని రెడీ చేసుకున్నాడని అంటున్నారు. రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఈ టీం పనిచేయనుంది.


ఇక తాజాగా చిరంజీవి బుల్లితెరలో రానున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో హోస్ట్ గా కనిపించనున్నారు. ఈ సీజల్ లో తన మూవీకి సంబంధించిన పూర్తి ప్రమోషన్ కోసం ఈ షోని ఉపయోగించుకోనున్నారు. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి సైతం నిర్వాహకుల వద్ద నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని అంటున్నారు. అందుకే వచ్చే నెల నుండి అంటే..అక్టోబర్ నుండి మెగాస్టార్ చిరంజీవి తను చేస్తున్న మీలో ఎవరు కోటిశ్వరుడు షోలో కనిపించనున్నారు.


అప్పటి నుండే “ఖైదీ నెం.150” మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కి ఆ షోని  ఉపయోగించనున్నారు. “ఖైదీ నెం.150” మూవీ ప్రమోషన్స్ కి ఇది సరైన వేధిక అని అందరూ అంటున్నారు. ఇక “ఖైదీ నెం.150” మూవీ ఇప్పటి వరకూ దాదాపు 50% పైగా షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ మూవీని సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయటానికి చిత్ర యూనిట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ పండుగ సందర్భాన్ని ఉద్ధేశించి చిత్రనిర్మాణం వేగంగా జరుగుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: