మెగాహీరో రామ్ చరణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ‘ధృవ’. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తమిళ చిత్రం ‘తనీఒరువన్’ కు రీమేక్ గా చేస్తున్న ‘ధృవ’ మూవీలో రామ్ చరణ్  నటిస్తున్నాడు. ఈ చిత్రం పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు, ఆశలున్నాయి. గత కొంత కాలంగా కొన్ని చిత్రాలు నుండి రామ్ చరణ్ చెప్పుకొదగ్గ సక్సెస్ ని అందుకోలేకపోవటంతో…‘ధృవ’ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 


‘ధృవ’ మూవీ కచ్ఛితంగా భారీ సక్సెస్ ని అందిస్తుందని చిత్ర యూనిట్ సైతం గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి సైతం ఈ మూవీపై ప్రత్యేక శ్రద్ధని చూపి, తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొన్ని కీలకమైన సన్నివేశాలని ఇక్కడ చిత్రీకరణ చేస్తున్నారు. అలాగే తనిఒరువన్ లో విలన్ గా మెప్పించిన అరవింద స్వామి, ఇందులోనూ చరణ్ సరసన నటించటంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్నారు. 


‘ధృవ’ మూవీపై ఇన్ని రకాల ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ…ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ సైతం చాలా స్లోగా ఉందని అంటున్నారు. ఇప్పటి వరకూ ఈ మూవీపై జరిగిన బిజినెస్ చాలా తక్కువ అని ఇండస్ట్రీ నుండి అందుతున్న రిపోర్ట్స్. గతంలో రామ్ చరణ్ మూవీ నిర్మాణంలో ఉండగానే బిజినెస్ వేగంగా జరిగింది. గత చిత్రాలతో పోలిస్తే…ఈ ‘ధృవ’ చిత్రం మాత్రం చాలా తక్కువ బిజినెస్ ని చేస్తుందని అంటున్నారు. దీంతో చిత్ర యూనిట్ ‘ధృవ’ బిజినెస్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది.


మార్కెట్ వర్గాలని మెప్పించేందుకు త్వరలోనే ‘ధృవ’ మూవీకి సంబంధించిన టీజర్ ని, నిర్మాణంలో ఉన్న మేకింగ్ విజువల్స్ ని రిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా ‘ధృవ’ బిజినెస్ వ్యవహారం చరణ్ కి షాక్ ఇచ్చిందని అంటున్నారు. అందుకే చరణ్ ఈ తరహా ప్లానింగ్ ని నిర్మాతలకి చెప్పినట్టుగా తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హిపాప్ తమీజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ నెల మొదటివారంలో విడుదలకానుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ధృవ’ మూవీలో నటించటమే కాకుండా తన తండ్రి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం.150కి నిర్మాతగా ఉంటూ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: