టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా నెంబర్ వన్ స్థానంలో ఉన్న డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో సక్సెస్ ని సాధించిందో తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి...బాహుబలి సీక్వెల్ కి తెరకెక్కించే పనిలో బిజిగా ఉన్నాడు.

త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ విజువల్స్ ని రిలీజ్ చేయనున్నారు. అలాగే బాహుబలి సీక్వెల్ కి సంబంధించి కొత్త పాత్రలపై స్పెషల్ టీజర్స్ ని సైతం త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇంతటి టాప్ డైరెక్టర్ కి ఎటువంటి ఇష్టాలు..అయిష్టాలు ఉంటాయి అనేది తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.

తాజాగా రాజమౌళి తనకి బాగా ఇష్టమైన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. రీసెంట్ గా రాజమౌళి "ఎమ్ఎస్ ధోని" ఆడియో ఫంక్షన్ కి హాజరు అయ్యాడు. ఇదే వేదిక మీద ధోనిని కలుసుకునే అవకాశం రాజమౌళికి వచ్చింది. ఇక ఈ వేధికగా తనకి క్రికెట్ అంటే మహాపిచ్ఛి అంటూ తన భావాల్ని చెప్పుకొచ్చాడు. తను క్రికెట్ ని ఎంతలా ఫాలో అవుతాడో అనేది స్పష్టం గా చెప్పుకురావటం జరిగింది.

ముఖ్యంగా ధోనికి తను ఫ్యాన్ ని అంటూ చెప్పటం మరింత విశేషం. ఇక "ఎమ్ఎస్ ధోని" మూవీ ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి...ధోనిని సెల్ఫీ అడగటం హైలెట్ గా నిలిచింది. ఈ మూవీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.... ‘"ఎమ్ఎస్ ధోని" – అన్ టోల్డ్ స్టోరీ’చిత్రం హిందీతో పాటు పలు రీజనల్ భాషల్లో రిలీజ్ అవుతుంది. నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన ఈ "ఎమ్ఎస్ ధోని" చిత్రం...కచ్ఛితంగా సహజత్వానికి దగ్గరగా ఉందని బిటౌన్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. కచ్ఛితంగా ఈ మూవీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని భారీ స్థాయిలో చేజిక్కించుకుంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: