ఈ మధ్య  కాలంలో స్టార్ ప్రొడ్యూజర్ అల్లుఅరవింద్ ఏ సినిమాపై పెట్టుబడులు పెట్టినా...లాభాల వరద పెడుతుందని అంటున్నారు. సినీ నిర్మాణంలో అపార అనుభవం కలిగి ఉన్న నిర్మాతలతో అల్లుఅరవింద్ ఒకరు. ఈ తరం యంగ్ ఆర్టిస్ట్ లతో అల్లుఅరవింద్ సినిమాలను చేస్తూ...బాక్సాపీస్ వద్ద హిట్ చిత్రాలను నిలుపుతున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాలకి ఓ రకమైన బిజినెస్, చిన్న చిత్రాలకి ఒక రకమైన బిజినెస్ వంటి పద్ధతులని అల్లుఅరవింద్ పాటిస్తున్నాడు.


ఇక రీసెంట్ గా అల్లుఅరవింద్ నిర్మించిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’ తనకి 8 కోట్ల రూపాయల లాభాలను తీసుకొచ్చిందని అంటున్నారు. ట్రేడ్ రిపోర్ట్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలను చూస్తే... అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగష్టు 5న విడుదలైంది.


రీసెంట్ గా ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఈ 50 రోజులకి ‘శ్రీరస్తు శుభమస్తు’ మూవీ దాదాపు 20 కోట్లరూపాయల మేర కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. సాధ్యమైనంత వరకూ ఈ మూవీని నిర్మాత సొంతంగా రిలీజ్ చేసుకొన్నారు. దాంతో నిర్మాతకి మంచి లాభాలే వచ్చాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా వచ్చిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం...నిర్మాతకి 8 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చింది.


ఈ మూవీ అల్లుశిరీష్ కెరీర్లోనే అత్యధికంగా వసూళ్లు సాదించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ విజయంతో అల్లుశిరీష్ మార్కెట్ ఇంకా పెరిగిందని అంటున్నారు. అలాగే తన వాల్యూ సైతం రెండింతలుగా పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీరస్తు..శుభమస్తు చిత్రం మంచి విజయం సాధించటంతో కొత్త నిర్మాతలు శిరీష్ పై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: