టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మహేశ్ బాబు ఫిల్మ్ కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకూ మహేశ్ బాబు కి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరితోనూ గొడవలు లేవు. అలాగే కాంట్రవర్సీల జోలికి కూడ వెళ్లలేదు. అందరూ మహేశ్ బాబు అంటే ప్రత్యేకమైన అభిమానాన్ని చూపుతారు. ఇదిలా ఉంటే మహేశ్ బాబు త్వరలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి షాకింగ్ ఇవ్వనున్నాడని అంటున్నారు.


ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం మేరకు దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం మహేశ్ బాబు డైరెక్టర్ మురుగదాస్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి నిర్మాణం జరుపుకుంటుంది. ఈ మూవీపై మహేశ్ బాబు భారీ అంచనాలనే పెట్టుకున్నాడు. శ్రీమంతుడు వంటి సక్సెస్ తరువాత వచ్చిన బ్రహ్మోత్సవం మహేష్ బాబుకి భారీ నిరాశని ఇచ్చింది.


అందుకే మురుగదాస్ మూవీపై మహేష్ కి ఆశలు ఉన్నాయి. ఇక ఈ కాంబినేషన్ అనంతరం మహేష్ బాబు డైరెక్టర్ కొరటాల శివ తో తన తదుపరి సినిమా చేయనున్నాడని అంటున్నారు. వీరి కాంబినేషన్ పై రానున్న మూవీపై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న సెకండ్ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా రానుందని అంటున్నారు. ఇందులో ముఖ్యమంత్రులు చేస్తున్న అవినీతి ఎలా ఉంటుంది? సిస్టమ్ ఏ విధంగా  కరెప్ట్ అవుతుంది? అన్న దానిపై కొరటాల కథని రెడీ చేయనున్నారు.


అయితే ప్రస్తుత రాజకీయలను ఉద్ధేశించి ఈ మూవీ ఉంటుందనే టాక్స్ సైతం బలంగా వినిపిస్తున్నాయి. ఎప్పడూ కాంట్రవర్సీ కానీ మహేష్ బాబు....తన సినిమాల ద్వార ప్రస్తుత ముఖ్యమంత్రులని టార్గెట్ చేసే విధంగా తన సినిమాని తీయగలడా? అనేది అందరిలోనూ ప్రశ్నగా వినిపిస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన సమాచారం బయటకు రానుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: