తెలుగులో మల్టీ స్టారర్ సినిమాల సంఖ్య బాగా పెరిగితే బాగుటుంది అని టాప్ హీరోల అభిమానులు అంతా ఎదురు చేస్తున్న నేపధ్యంలో మహానటి కోసం తారక్ చైతన్యలు చేతులు కలపడానికి అంగీకరించనట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈ ప్రయాత్నాలకు నిర్మాత అశ్వనీదత్ శ్రీకారం చుట్టడంతో నాగార్జున సహకారం కూడ ఈ ప్రయత్నాలకు బాసటగా నిలుస్తోంది అన్న వార్తలు వినపడుతున్నాయి.

ఇక ఈ న్యూస్ వివరాలలోకి వెళితే నిర్మాత అశ్వినీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకుడుగా మహానటి సావిత్రి జేవితం పై చాల పరిశోధన చేసి ఒక సినిమాను తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘మహానటి’ అన్న టైటిల్ ను ఇప్పటికే రిజిస్టర్ చేసారు.  సావిత్రిగా నిత్యామీనన్ నటించబోతోంది.

సావిత్రి జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనలను సినిమాగా తీయబోతున్న ఈ సాహసానికి జూనియర్ నాగాచైతన్యల  ప్రోత్సాహం కూడ లభించినట్లుగా తెలుస్తోంది.  సావిత్రి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అక్కినేని నందమూరి లతో నటించిన నేపధ్యంలో ఆ పాత్రలు కూడ ఈ సినిమాలో కీలకం అయిన నేపధ్యంలో ఆ పాత్రలను నాగచైతన్య జూనియర్ లు నటిస్తే ‘మహానటి’ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడుతుంది అన్న ఉద్దేశ్యంతో అశ్వినీదత్ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు టాక్.

ఈ విషయం అశ్వినీదత్ ఇప్పటికే నాగార్జున దృష్టికి తీసుకు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి.  ఎప్పటినుంచో నాగార్జునకు జూనియర్ నాగాచైతన్యలు ‘గుండమ్మకథ’ సినిమా రీమేక్ లో నటిస్తే చూడాలని నాగ్ చిరకాల కోరిక.  అయితే ఈ కల పగటి కలగా మారిపోయిన నేపధ్యంలో అనుకోకుండా ఇలాంటి ప్రోపజల్ వేరేవిధంగా అశ్వినీదత్ నుండి రావడంతో నాగార్జున ఈ సూచనకు వెంటనే స్పందించమే కాకుండా అశ్వినీదత్ కల నెరవేరడానికి రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.

మహానటి సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించడానికి నాగచైతన్య వైపు నుండి ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా ఈ ప్రత్యేక పాత్ర విషయమై జూనియర్ ను ఒప్పించే విషయoలో కొంత సమస్య ఏర్పడుతుంది అని అంటున్నారు. అయితే నాగార్జునకు జూనియర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం రీత్యా నాగ్ గట్టిగా తలుచుకుంటే ‘మహానటి’ కోసం తారక్ చైతన్యాల కలయిక ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలే నిజం అయితే నిజంగానే ఈ ‘మహానటి’ విడుదల కాకుండానే బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టించడం ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 
  



మరింత సమాచారం తెలుసుకోండి: