ఈ మదయ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వారు ఏం చేసినా అదో పెద్ద సంచలనం చేస్తూ సోషల్ మీడియా రచ్చ రచ్చ చేస్తుంది. బతికి ఉన్న వారిని చనిపోయినట్లు ప్రత్యక్షం కావడం..హీరో హీరోయిన్లకు అఫైర్లు ఉన్నట్లు చూపడం ఇలా చిత్ర విచిత్రమైన న్యూస్ తో సెలబ్రెటీలకు ముప్పతిప్పలు పెడుతుంది. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా పైకి వస్తున్న రాజ్ తరుణ్, యాంకర్ లాస్య కు రహస్యంగా పెళ్లి అయినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ నేరుగా ట్విట్టర్ లో ‘కుమారి 21 ఎఫ్ ఆడియో రిలీజ్ టైం లో యాంకర్ లాస్యను ఒకే ఒక్కసారి కలిశాను. నా ప్రమేయం లేకుండానే లాస్యతో నా పెళ్లి చేసిన కొంతమంది మీడియా మిత్రులకు, వెబ్ సైట్ దరిద్రులకు నా కృతజ్ఞతలు’ అని పెట్టారు. మరోవైపు యాంకర్ లాస్య ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు..అంతే కాదు ఈ అమ్మడు గత కొన్ని రోజులుగా బుల్లి తెరపై కూడా కనిపించడం లేదు.

ఏది ఏమైనా ఇలాంటి రూమర్లు వస్తే వెంటనే ఏదో ఒక క్లారిఫికేషన్ ఇవ్వకుంటే అది కాస్త జనాలు నిజమే అని నమ్మే స్థాయిలో పబ్లిసిటి అవుతుంది.  రాజ్ తరుణ్ మాట్లాడుతూ తనకు ఇప్పుడు కెరీర్ చాలా ముఖ్యమని మూడు సంవత్సరాల తర్వాత వివాహం గురించి ఆలోచిస్తానని అప్పుడు తప్పకుండా మీడియాకు వెల్లడిస్తానని అన్నారు. ఇలాంటి రూమర్లు రావడం తనకు చాలా ఆవేదన కలిగించిందని బాధను వ్యక్తపరిచాడు.

రాజ్ తరుణ్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: