స్టార్ కమెడియన్‌ నుంచి హీరోగా మారిన సునీల్ వరుస సినిమాలను తీయకుండా ...కాస్త మంచి కథలను సెలక్ట్ చేసుకొని వస్తున్నాడు. దీంతో సునీల్ నటిస్తున్న సినిమాలు బాక్సాపీస్ వద్ద పూర్తి బోల్తాపడకుండా...నిర్మాతలకి పర్వాలేదనిపించే విధంగా లాభాలను తీసుకువస్తున్నాయి. అందుకే సునీల్ తో మూవీలను తీసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు.


ఇదిలా ఉంటే సునీల్ రీసెంట్ గా ‘జక్కన్న’ సినిమాతో ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ..ఇప్పుడు తన నెక్ట్స్ మూవీతో హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాజాగా తన కొత్త సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’తో ముందుకు రానున్నాడు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కానుంది. రిలీజ్ కి సమయం తక్కువగా ఉండటంతో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ ని చిత్ర యూనిట్ వేగవంతం చేసింది.  


వీరు పోట్ల తెరకెక్కించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇక మార్కెట్ లో వచ్చిన‘ఈడు గోల్డ్ ఎహే’ థియోట్రికల్ ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది. ట్రైలర్ చూసిన వారికి ‘ఈడు గోల్డ్ ఎహే’ థియోట్రికల్ ట్రైలర్ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉందని అర్ధం అవుతుంది. ఇక డిస్ట్రిబ్యూటర్స్ సైతం ట్రైలర్ ని చూసిన అనంతరం ఈ మూవీపై పాజిటివ్ ఫీలింగ్ పెరిగిందని అంటున్నారు. 


సునీల్ ఎనర్జీ ఈ సినిమాకి ప్లస్ కానుంది. అయితే దసర కానుకగా వస్తున్న ఈ మూవీకి థియోటర్స్ ఎక్కువుగా దొరికినట్టు తెలుస్తుంది. ఇది ‘ఈడు గోల్డ్ ఎహే’ ఓపెనింగ్ డే కలెక్షన్స్ కి కలిసొచ్చే అంశం. మొదటి మూడు రోజులు ‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రానికి భారీగా థియోటర్స్ దొరకటంతో...కచ్ఛితంగా ఈ మూవీ మంచి కలెక్షన్స్ ని కొల్లగొడుతుందని అంటున్నారు. అందుకే ఈ దసర పండుగ సునీల్ కి బాగా కలిసొచ్చిందని అంటున్నారు. ఇక ఈ మూవీలో సునీల్ సరసన సుష్మా రాజ్, రిచా పనాయ్‌లు హీరోయిన్లుగా నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: