వరస పరాజయాలతో సతమతమైపోతున్న సునీల్ తన కెరియర్ కు సంబంధించి విషమ పరీక్షలు ఎదుర్కొంటూ వచ్చేనెలలో రాబోతున్న దసరా పండుగ సీజన్ లో తన కెరియర్ కు సంబంధించిన క్లైమాక్స్ ను చూడబోతున్నాడు.  సునీల్ లేటెస్ట్ మూవీ ‘ఈడు గోల్డ్ ఎహే’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో సునీల్ ఈ సినిమా పాటలను ముఖ్యమైన నగరాలలో జనం మధ్య విడుదల చేస్తూ ఈ సినిమాను వెరైటీగా ప్రమోట్ చేస్తున్నాడు.

దీనికితోడు ఈ సినిమా విడుదల తేదీ అక్టోబర్ 7 అయినా చాల ముందుగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఇంటర్వ్యూలను ఛానల్స్ లో యిస్తూ ఈ సినిమా పై ఆసక్తి కలిగించడానికి తన వంతు ప్రయత్నాన్ని చాల గట్టిగా చేస్తున్నాడు ఈ జక్కన్న.   సుష్మారాజ్, రీచా పనై  హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వీరు పోట్ల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 

ఇప్పటి వరకు ఈసినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందని అనుకుంటున్నారు అంతా.  అయితే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లేటెస్ట్ ట్రైలర్‌ను చూస్తే రవితేజ కెరియర్ లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన కిక్ సినిమా గుర్తుకు వస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

రవితేజ ‘కిక్’ సినిమాలో చేసినట్లుగా ముఖానికి మాస్క్ వేసుకుని తాను అనుకున్న పనిని చేస్తూ విలన్స్ కి ట్విస్ట్ ఇచ్చే పాత్రలో కనిపిస్తున్న సునీల్ ను చూస్తూ ఉంటే రవితేజ ‘కిక్’ సినిమా గుర్తుకు వస్తోంది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.  అంతేకాదు ఒక డిఫరెంట్ సినిమాను చేయబోతున్నాను అంటూ మీడియా ఇంటర్వ్యూలలో తెగ గొప్పలు చెపుతున్న సునీల్ చివరికి వచ్చేసరికి ప్రేక్షకులకు ‘ఈడు గోల్డ్ ఎహే’ లో రవితేజా ‘కిక్’ సినిమాను కొద్దిగా మార్చి మళ్ళీ చూపించబోతున్నాడా అంటూ ప్రచారం మొదలైంది. 

ఈ విషయాలు ఏమి పట్టించు కోకుండా సునీల్ తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్ ను మరింత వేగం పెంచుతున్నాడు.  అంతేకాదు దసరా పండుగలో తన కామెడీతో ప్రేక్షకులను క్లాస్‌, మాస్‌ అనే తేడాలేకుండా థ్రిల్‌ చేయడమే తన లక్ష్యం అని అంటున్నాడు. 

అయితే దసరా పండుగను టార్గెట్ చేస్తూ క్రేజీ యంగ్ హీరోలు తమ సినిమాలను భారీ పబ్లిసిటీతో విడుదల చేస్తున్న నేపధ్యంలో ఏ ధైర్యం చూసుకుని సులీల్ ఈ సాహసం చేస్తున్నాడు అంటూ ఫిలింనగర్ లో జోక్స్ వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: