పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ని దాచిపెడుతున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...పవన్ కల్యాణ్ నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రం తాజాగా సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఒకవైపు షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం...మరోవైపు స్టార్ కాస్టింగ్ కి సంబంధించిన సెలక్షన్స్ ని సైతం చేస్తుంది. సినిమా లేటుగా స్టార్ట్ కావటంతో...కొంత మంది ఆర్టిస్ట్ లు, టెక్నిషన్స్ ఈ మూవీ నుండి తప్పుకోవటం జరిగింది.


దీంతో ఇప్పుడు ఆ ఆర్టిస్ట్ ల భర్తిని పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవన కళ్యాన్ నటిస్తున్న ఈ కాటమరాయుడు చిత్రం ఓ స్ట్రైయిట్ చిత్రంగా వస్తుందనేది ఇప్పటి వరకూ ప్రేక్షకులకి తెలిసిన విషయం. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలోని క్లియర్ టాక్స్ ప్రకారం...ఈ మూవీ ఓ తమిళ మూవీకి రిమేక్ గా తెరకెక్కుతుందని అంటున్నారు.


ఈ న్యూస్ ని చిత్రటీం బయటకు చెప్పటానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. తమిళంలో వచ్చిన అజిత్ మూవీ 'వీరమ్'బ్లాక్ బస్టర్ ని సాధించింది. అదే వీరమ్ ఇప్పుడు తెలుగులో కాటమరాయుడి మూవీతో పవన కళ్యాణ్ చేస్తున్నాడట. గత కొద్ది చిత్రాలుగా పవన్ కళ్యాణ్ కేవలం రిమేక్ కథలకే పరిమితమవుతున్నాడు. అయితే సర్ధార్ గబ్భర్ సింగ్ మూవీ తరువాత పవన్ కళ్యాణ్ స్ట్రయిట్ చిత్రానికి రెడీ అయినప్పటికీ...సరైన కథ దొరక్కపోవటంతో..ఇలా రిమేక్ చిత్రానికి రెడీ అయినట్టుగా తెలుస్తుంది.


అయితే ఓ రిమేక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చిత్ర టీం...ఆ విషయాన్ని మాత్రం బయటకు చెప్పకపోవటం ఇండస్ట్రీని ఆశ్ఛర్యానికి గురిచేస్తుంది. ఇక తాజాగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి సోదరిడిగా కమల్ కామరాజు ని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేయటం జరిగింది. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: