యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతాగ్యారుజ్ కి సంబంధించిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతాగ్యారేజ్..ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంతటి సక్సెస్ తరువాత జూనియర్ ఏ మూవీని చేస్తే బాగుంటుంది...అనేదానిపై చర్ఛలు బాగానే జరుపుతున్నాడు. ఒకవైపు రిమేక్ చిత్రాలను చేద్ధామా? లేక స్ట్రయిట్ చిత్రాలను చేద్దామా? అనే సందేహంలో ఉన్నాడు.  


అయితే టాలీవుడ్ కి చెందిన ఓ డైరెక్టర్...ఎన్టీఆర్,ఏఎన్నార్ కలిసి నటించిన 'గుండమ్మకథ'ను నాగచైతన్య..ఎన్టీఆర్ లతో తెరకెక్కించాలనే ప్రయత్నాన్ని బలంగా చేస్తున్నాడు. దీనికి సంబందించిన చర్ఛలు ఇప్పటికే రెండు, మూడు సార్లు జరిగాయని అంటున్నారు.అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్...నాగచైతన్యని కాస్త పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఇటీవల దర్శకుడు నాగ్ అన్వేశ్ సైతం ఎన్టీఆర్, చైతూలను కలసి గుండమ్మకథ రిమేక్ పై కొన్ని సూచనలు చేశాడని అంటున్నారు.


అయితే ఎన్టీఆర్ ఆలోచనల ప్రకారం...కో యాక్టర్ గా అక్కినేని హీరో కాకుండా మరో హీరో అయితే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్ఛలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు అక్కినేని నాగార్జున మాత్రం గుండమ్మకథ రిమేక్ జరిగితే...అందులో కచ్ఛితంగా అక్కినేని కుటుంబ వారసులు ఉండాల్సిందే అని భావిస్తున్నారు.


దీనికి సంబంధించిన రిమేక్ కార్యరూపం దాల్చితే చివరిగా స్టార్ కాస్టింగ్ ఎలా ఉండబోతుందో అంటూ చిత్ర పరిశ్రమలోనూ ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం నాగచైతన్య ప్రేమమ్ మూవీకి సంబంధించిన రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. అలాగే ఈ మూవీ తరువాత రెండు కమర్షియల్ ప్రాజెక్ట్స్ ని ఒప్పుకున్నాడు. ఆ తరువాత గుండమ్మకథకి సంబంధించిన ప్రాజెక్ట్ మొదలు కావచ్చనే టాక్స్ క్లియర్ గా వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: