సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎవరైనా కొత్త హీరోయిన్ ఎంట్రి ఇచ్చిందంటే...తనకి ఇండస్ట్రీ గురించి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఇండస్ట్రీపై కొంత అవగాహన వచ్చేవరకూ కొంత మందిని నమ్మకతప్పుదు. ఒక్కోసారి వారితోనే ట్రావెల్ అవుతుంటారు. ఇప్పుడు అదే విధంగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ విషయంలో జరుగుతుందని అంటున్నారు.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా వస్తుందనే విషయం తెలిసిందే. ఈ మూవీలో నాగచైతన్య కథానాయకుడిగా నటించాడు. ఇందులో హీరోయిన్ గా “మంజిమా మోహన్” నటించింది. అయితే ఈ మూవీ తరువాత “మంజిమా మోహన్” కి మంచి బ్రేక్ రానుందని అంటున్నారు. అలాగే “మంజిమా మోహన్” డైరెక్టర్ గౌతమ్ మీనన్ కి ఫ్యాన్ గా మారిందని అంటున్నారు.


గౌతమ్ మీనన్ అంటే “మంజిమా మోహన్” కి చాలా ఇష్టం అని తనే పలు సందర్భాల్లో బాహాటంగానే చెప్పింది. అయితే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ డైరెక్టర్ గౌతమ్ తో రిలేషన్ లో ఉందని అంటున్నారు. “మంజిమా మోహన్” కి ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మంచి అవకాశాలు రావటానికి గౌతమ్ మీనన్ రిఫరెన్స్ ఎంతగానో ఉందని అంటున్నారు.


సాహసం శ్వాసగా సాగిపో మూవీ ఇంకా విడుదుల కాక ముందే...మంజిమా మోహన్ తో గౌతమ్ మీనన్ మరో మూవీని కన్ఫర్మ్ చేశాడు. ఈ చిత్రం సైతం ద్విభాషా చిత్రంగా రానుంది. పృథ్వీరాజ్, సాయి ధరమ్ తేజ్, పునీత్ రాజ్ కుమార్, అనుష్క, తమన్నాలతో పాటు మంజిమా మోహన్ సైతం ఇందులో నటించనుందని గౌతమ్ చెప్పుకొచ్చారు. దీనికి కారణం వీరిద్దరి మధ్య రిలేషన్ అని కోలీవుడ్ లో జరుగుతున్న టాక్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: