యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కోపం తెప్పించే న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. దీనికి సంబందించిన వివరాల్లోకివెళితే...యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’. తన కెరీర్లోనే ‘జనతా గ్యారేజ్’ మంచి సక్సెస్ ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ ని ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీ 80 కోట్లరూపాయల కలెక్షన్స్ ని కలెక్ట్ చేసిందని అందరూ చెప్పుకుంటున్నారు.


అయితే ఈ విషయంపైనే ఎన్టీఆర్ కి కోపం వచ్చిందని అంటున్నారు. నిజానికి ‘జనతా గ్యారేజ్’ మూవీ 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. అయితే ఈ విషయాన్ని ఎవ్వరూ బయటకు చెప్పకపోవటంతో తన మూవీకి సంబంధించిన కలెక్షన్స్ బయటకు రావటంలేదని అంటున్నారు. నిజానికి ‘జనతా గ్యారేజ్’ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ వివరాలను చూస్తే... ‘జనతా గ్యారేజ్’ ఇప్పటివరకూ 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.


ఇంకా థియోటర్స్ లో ఈ మూవీకి ప్రేక్షకుల వద్ద నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ విషయాన్ని తాజాగా స్టార్ యాక్టర్ మోహన్ లాల్ కూడ చెప్పుకువచ్చారు. “జనతా గ్యారేజ్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్‌తో ‘ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది’ అని చెప్పానని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటి వరకూ 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ అనేవి సాధ్యపడలేదు.


కానీ ‘జనతా గ్యారేజ్’ తో ఎన్టీఆర్ 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ ఇచ్చినప్పటికీ...చాలా మంది ఈ విషయాన్ని చెప్పకపోవటంతో జూనియర్ కాస్త ఫైర్ అయినట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ తన ‘జనతా గ్యారేజ్’ మూవీతో 100 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంట్రి ఇవ్వటం అనేది అభిమానులని సంతోష పెడుతున్న విషయంలా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా... సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్స్ గా చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: