తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అటు నటనలోనూ, ఇటు డ్యాన్స్‌లోనూ ఇరుగదీస్తుంటాడు. ఎన్ని చేసినా.. వివాదాలకు మాత్రం దూరంగానే ఉంటాడు. కానీ అవసరం వస్తే మాత్రం కౌంటర్‌ అటాక్‌ ఇవ్వడానికి ఎప్పుడూ రెఢీగానే ఉంటాడు.


అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు తమిళం, కేరళలోనూ అభిమానులు ఉన్నారు. ఇక్కడ విడుదలయ్యే ప్రతి సినిమా అక్కడ కూడా రిలీజ్‌ అవుతుంటుంది. అయినా ఇప్పటి వరకు అక్కడ ఒక్క సినిమాలోనూ స్టేయిట్‌గా నటించింది లేదు. అయితే త్వరలోనే అది కూడా నెరవేరనుంది. తమిళంలో చేయబోయే సినిమాకు సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని ఇప్పటికే వెల్లడైంది.


 హీరో సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా ప్రొడక్షన్‌లో లింగుస్వామి డైరక్షన్‌ లో.. తన తొలి తెలుగు-తమిళ్ మూవీ  రాబోతుందని బన్నీ అనౌన్స్‌ చేశాడు. దీనిపై గతంలోనే చర్చలు జరిగినా మీడియాకు కూడా చెప్పకుండానే తన పని తాను చేసుకుపోతున్నాడు. అయితే ఈ సినిమాను ఇంత త్వరగా ప్రకటించేయడం వెనుక ఒక స్ర్టాంగ్ రీజన్ ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ జనాలు చెప్పుకుంటున్నారు.


నిజానికి ఎప్పుడో కథ చెప్పేసిన లింగుస్వామి అల్లు అర్జున్‌ కాల్షీట్ల కోసం వెయిటింగులోనే ఉన్నాడు. ఆయన బన్నీతో సినిమా చేయబోతున్నా అంటున్నాడు కాని.. మధ్యలో బన్నీ మాత్రం ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయితే ఈ మధ్య లింగుస్వామి ఎన్టీఆర్ ను ఎప్రోచ్ అయ్యాడు అనే రూమర్లు వచ్చాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బన్సీ.. తన తమిళ్‌ మూవీపై స్పందించడాడు. లింగుస్వామితో కథ గురించి మరోసారి చర్చించి.. ప్రొడ్యూసర్ గా జ్ఞానవేల్ రాజాను సెట్ చేసి.. వెంటనే ప్రకటన ఇచ్చేశాడని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: