తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీమొద్దీన్ (నయీమ్) గత నెలలో గ్రేహౌండ్స్ దళాల చేతిలో ఎన్ కౌంటర్ గావింపబడ్డాడు. మొదట్లో నయీమ్ సాధారణ గ్యాంగ్ స్టర్ గా మాత్రమే పరిగణించబడ్డా అతను చనిపోయిన తర్వాత పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయట పడుతున్నాయి. నయీమ్ కేవలం గ్యాంగ్ స్టర్ మాత్రమే కాకుండా అమ్మాయిలను సప్లై చేయడం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం, మహిళా సెక్యూరిటీతో అడ్డగోలు బెదిరింపులు, హత్యలు ఇలా ఎన్నో నగ్న సత్యాలు బయట పడ్డాయి.
అంతే కాదు ఒకదశలో నయీమ్ ఐఎస్ తో కూడా సంబంధాలు కొనసాగించాడా..లేదంటే అతనికి అన్న ఆయుధాలు ఎక్కడ నుంచి వచ్చాయన్న వాటిపై సిట్ దర్యాప్తు చేస్తుంది. ఇక నయీమ్ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముప్ప సంవత్సరాల్లో పది వేల కోట్లకు పైగా ఎలా సంపాదించగలిగాడు...అతనికి అండదండలు ఎక్కడ నుంచి వచ్చాయి అనే విషయంలపై ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. నయీమ్ మొదట్లో నక్సలైట్ గా ఉండగా కొంత కాలం తర్వాత అదే నక్సలైట్లను చంపే ఆయుధంగా తయారయ్యాడు. పోలీసులు నయీమ్ ని నక్సల్స్ పై ఆయుధంగా వాడుకున్నారని రూమర్లు ఉన్నాయి.
ఇక పోలిటికల్ లీడర్స్ కి అండదండగా ఉంటూ వారికి కావాలసిన పనులు చేసి పెడుతూ వచ్చాడు. ఇమ రియల్ ఎస్టే వ్యాపారులు, కొంత మంది బిజినెస్ మాన్స్ కూడా నయీమ్ తో అక్రమంగా ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించి నయీమ్ ని పెద్ద డాన్ గా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇలాంటి గ్యాంగ్ స్టర్స్, క్రిమినల్స్ పై సినిమాలు తీయడంలో దిట్ట.
తాజాగా నయీమ్ పై మూడు భాగాలుగా సినిమా తీస్తానని ఆ మద్య స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. తాజాగా నయీమ్ పై ఓ పాట సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. నయీమ్ అనేవాడు పోలీసులు, పొలిటీషన్లు, బిజినెస్ మాన్స్ తీర్చి దిద్దిన పెద్ద క్రిమినల్ అని రాంగోపాల్ వర్మ వాయిస్ ఓవర్ తో పాట మొదలైంతుంది. ఇప్పడు ఈ సాంగ్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.