ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తున్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్,లింగుస్వామి కాంబినేషన్. లింగుస్వామితో మూవీని చేయటానికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి పలువురు హీరోలు ప్రయత్నాలు చేశారు. దాదాపు సంవత్సరకాలంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సరైనోడు వంటి మాస్ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్…తరువాత చాలా తెలివిగా గేమ్ ఆడాడు.


కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లింగుస్వామి చేయబోతున్న ఒక సినిమా అనూహ్యంగా పోస్ట్ పోన్ కావటంతో…తనకి డైరెక్టర్ గా ఫోన్ చేసి తన డేట్స్ ని ఇచ్చేశాడు. ఈ పరిణామానికి షాక్ అయిన లింగుస్వామి ఇక చేసేది ఏమిలేదు అన్నట్టుగా వెంటనే అల్లు అర్జున్ తో కమిట్ అయ్యాడు. ఈ విషయం టాలీవుడ్ పిల్మ్ ఇండస్ట్రీలోని కొంత మంది టాప్ హీరోలకి ఇది ఏ మాత్రం మింగుడు పడటం లేదు. ఇదిలా ఉంటే….ఈ మూవీకి సంబంధించిన ఓ విషయంలో డైరెక్టర్ లింగుస్వామి ఆశ్ఛర్యపోయాడు.


హీరో అల్లు అర్జున్…ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాల్లోనూ కాస్త ఎక్కవుగానే వేలు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. తన రెమ్యునరేషన్ భాగంగా తెలంగాణ నైజాం రైట్స్ ని ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ కి చెప్పుకొచ్చాడు. జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ…అల్లఅర్జున్ కోరిక కొంత ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా…వారి ఆలోచనలు మాత్రం వ్యాపాపరంగానే ఉంటాయని చాలా మంది అంటుంటారు. అలాగే అల్లుఅర్జున్ సైతం ప్రస్తుతం తన మార్కెట్ ని పెంచుకునే క్రమంలోనే తమిళ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో సినిమాని చేస్తున్నారు. అందుకే తన రేంజ్ కి తగ్గట్టుగా నైజాం రైట్స్ ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.


ఒకవేళ నిర్మాతల వద్ద నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం…లింగుస్వామి మూవీకి అల్లుఅర్జున్ తీసుకునే రెమ్యునరేషన్ దాదాపు 30 కోట్ల రూపాయలను మించి ఉంటుందని అంటున్నారు. ఇక ఈ మూవీ ద్విభాషా చిత్రంగా రూపొందనుంది. సెట్స్ మీదకు ఈ మూవీని తీసుకుపోవటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమా రూపొందుతుంది. ఈ మూవీ అటు తమిళ్ లోనూ, ఇటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ సాధించిందంటే… అల్లుఅర్జున్ మార్కెట్ భారీగా పెరిగినట్టే అని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగే అవకాశాలు కూడ ఉన్నాయని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: