తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగాస్టార్ తనయుడు రాంచరణ్. తీసినవి కొన్ని చిత్రాలే అయిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు చెర్రీ. ఇక తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన రాంచరణ్ ‘జంజీర్’ చిత్రం రిమేక్ లో నటించాడు. అయితే ఆ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోయింది. గతంలో మెగాస్టార్ కూడా బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. తాజాగా నీరజ్పాండే దర్శకత్వంలో టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోనీ..ది అన్టోల్డ్ స్టోరీ’చిత్రంలో చెర్రీ ఓ ముఖ్య పాత్ర పోషించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో దోనికి మంచి స్నేహితుడైన సురేష్ రైనా పాత్రను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసాడని టాక్. ధోని సినిమాలో సురేష్ రైనాకు సంబంధించి ఓ పాత్ర ఉండగా ఆ పాత్రకు రామ్ చరణ్ అయితే సూట్ అవుతాడని దర్శకుడు భావించాడట. అందుకే ఈ పాత్రను చెర్రీ చేయాలని కోరగా మనోడు వెంటనే ఒప్పుకున్నట్లు టాక్. ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్ నటి భూమికా చావ్లా, కైరా అద్వానీ, దిశాపాట్నీ, బాలీవుడ్ నటుడు, దర్శకుడు అనుపమ్ఖేర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుండగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడిప్పుడే వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే రిలీజ్ ‘ఎంఎస్ ధోనీ..ది అన్టోల్డ్ స్టోరీ’చిత్రం విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.