టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాకుండా వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ స్వీట్ మేనర్స్ మహేష్ ను తన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ ప్రిన్స్ గా మార్చింది అన్ని చాలామంది అంటూ ఉంటారు. 

అందుకే కాబోలు ఈ మధ్య జగపతి బాబు ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ మహేష్ నవ్వును అర్ధం చేసుకోవడం చాల కష్టం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.  ఇక నిన్న జరిగిన సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మహేష్ సాయి ధరమ్ తేజ్ పట్ల ప్రవర్తించిన తీరు అందర్నీ ఆశ్చర్య పరిచింది.

ఈ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే.  మహేష్ తో పాటు ఈ కార్యక్రమానికి యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా వచ్చాడు. వీళ్లతోపాటు కృష్ణ, విజయ నిర్మల, త్రివిక్రమ్ లతో పాటు ఎందరో పాల్గొన్న ఈ వేడుకలో ఒక్కసారి మహేష్ బాబు వేదిక మీదకు రాగానే ఒకేసారి అతిధులలో హడావిడి ఏర్పడి వేదిక పై చిన్న గందరగోళం ఏర్పడింది.

దీనితో అప్పటి వరకు ముందు వరసలో ఉన్న సాయి ధరమ్ తేజ్ జనం తాకిడితో వేదిక పై వెనక్కు వెళ్ళిపోయాడు.  అయితే అంత హడావిడిలో కూడ మహేష్ వెనక్కి వెళ్ళి పోయిన సాయి ధరమ్ తేజ్ వంక చూసి నవ్వుతూ అతడిని ముందుకు రమ్మని చెప్పి సాయి ధరమ్ తేజ్ ను తన తండ్రి కృష్ణ పక్కన నుంచో పెట్టాడు.

అయితే ఈ విషయాలను పసిగట్టిన మీడియా కెమెరాలు ఈ తతంగాన్ని లైవ్ టెలికాస్ట్ లో చూపించడంతో మెగా అభిమానులు కూడ మహేష్ మర్యాద పట్ల ప్రశంసలు కురిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో మహేష్ అభిమానులు కూడ తమ అభిమాన హీరో సంస్కారానికి ఫిదా అయి పోతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: