టాలీవుడ్ స్టార్ కాంబినేషన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేష్ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. వీరిద్దరి కాంబినేష్ లో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ వంటి చిత్రాలు ఎన్టీఆర్ కి మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళికి ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చాడు. రాజమౌళి గ్రాఫిక్స్ తో ఎంతటి గొప్పచిత్రాలను తెరకెక్కిస్తున్నప్పటికీ..ఈ చిత్రాలతో తను నేర్చుకున్న విద్యని, మహాభారతం సినిమా కోసమే అని గతంలో చెప్పుకొచ్చాడు.


మహాభారతాన్ని సినిమాగా చేయటం కోసం రాజమౌళి ఓ పక్కా ప్రణాళికని వేసుకున్నాడని అంటున్నారు. మహాభారతం యూనివర్సల్ స్టోరీ. ఇందులో ఎన్నో రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంతకు మించిన గొప్ప కథ దొరకటం కూడ సాధ్యపడని విషయం. అందుకే మహాభారతాన్ని తెరకెక్కించి సత్తాచాటాలనేది రాజమౌళి నిర్ణయం. అయితే తన ప్రయత్నం ప్రారంభం అయ్యేసమయానికి  ఈ కథకి సంబంధించిన నటులను గుర్తించటంలో రాజమౌళి నిమగ్నుడై ఉన్నాడు.


ఇందులో కొన్ని పాత్రలను స్టార్ యాక్టర్ ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకోనున్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ వంటి యాక్టర్ లేని మహాభారతం ఉండదని ఓ స్టార్ యాక్టర్ దగ్గర రాజమౌళి కామెంట్ చేయటం విశేషం. మొత్తంగా ఎన్టీఆర్ పై రాజమౌళికి ఉన్న నమ్మకం ఏపాటిదో…ఈ విషయాన్ని చూస్తే అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరూ స్టూడెంట్ నెం.1 మూవీ విషయంలో వారి పాత స్నేహానికి సంబంధించిన విషయాలను గుర్తుచేసుకున్నారు.


ఒకరిపై ఒకరు వారికున్న అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి బాహబలి2 కి సంబంధించిన పనుల్లో బిజిగా ఉన్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి కానుందని అంటున్నారు. అలాగే సాధ్యమైనంత త్వరగా ఈ మూవీకి సంబంధించిన కొత్త పాత్రల టీజర్స్ ని రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ కి సంబంధించిన డేట్స్ దగ్గరపడుతుండటంతో…పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సైతం మరింత సమాయాన్ని కేటాయిస్తున్నారు. ఈసారి  బాహుబలి2లో విజువల్స్ మరింత గ్రాండ్ గా కనిపించనున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: