ఒకరు తమిళ ఆరాద్య దైవం మరుదూరు గోపాల రామచంద్రన్ (ఎంజీఆర్) ఆయనే పురచ్చి తలైవార్ (క్రాంతియుత నాయకుడు) అంటారు..మరోకొరు కన్నడ కంఠీరవుడు రాజ్ కుమార్ కన్నడ చిత్రసీమంలో మకుటం లేని మహరాజులా వెలిగిపోయారు. డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు అందరూ ఆయను రాజ్ కుమార్ అంటారు.
లక్షలాది అభిమానులు "డాక్టర్. రాజ్" లేదా "అన్నావ్రు" (అన్నగారు) అని పిలిచేవారు. రాజ్ కుమార్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఇక తమిళ చిత్రరంగంలో మహానటులు ఎంజీఆర్ రంగస్థలంపై తగినంత అనుభవము గడించి, సినిమా రంగములో అడుగుపెట్టి అవిరాళ కృషి, పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగాడు.
ఈయన మంచి దర్శకుడు, నిర్మాత మరియు నైపుణ్యమున్న సినిమా ఎడిటరు కూడా. 1977 నుండి ఆయన మరణించేంతవరకు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వీరిద్దరూ ఒక కార్యక్రమంలో కలిసినపుడు తమ ఆప్యాయతను పంచుకున్న ఫోటో మీకోసం..