వచ్చేవారం  విడుదల కాబోతున్న ‘ప్రేమమ్’  పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.  చందూ మొండేటి  దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను  కమర్షియల్ హిట్ గా మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇప్పటికే విడుదల కాబడ్డ ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన రావడంతో ఈ సినిమా నాగ చైతన్యకు ఖచ్చితమైన హిట్ గా మారుతుందని చైతన్యతో పాటు నాగార్జున కూడ పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. 

ఈవార్తలు ఇలా  ఉండగా ఈ సినిమాకు వాయస్ ఓవర్ ఇస్తున్న నాగార్జున తెరవెనుక  చెప్పే మాటలకు  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ ను ప్రత్యేకంగా రాసినట్లు వార్తలు వస్తున్నాయి.  త్రివిక్రమ్ ఈ విధంగా తన కలాన్ని ‘ప్రేమమ్’  కు ఉపయోగించడం వెనుక ఒక ముఖ్య కారణం ఉంది అని అంటున్నారు. 

ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వారిలో ఒకరుగా ఉన్న నిర్మాత రాధకృష్ణకు త్రివిక్రమ్ కు ఉన్న ససాన్నిహిత్యం కూడా ‘ప్రేమమ్’ సినిమాకు త్రివిక్రమ్ చేత నాగార్జున వాయస్ ఓవర్ కు మాటలు రాయించేలా చేసింది అనే వార్తలు కూడ ఉన్నాయి.  గతంలో నాగార్జున నటించిన ‘మన్మధుడు’ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాసి సూపర్ హిట్ కొట్టిన సెంటిమెంట్ కూడ త్రివిక్రమ్ చేత ఇలా చేయిచే విధంగా మార్చింది అనిటాక్.  

ఈ సినిమాలో వెంకటేష్ కూడ ఒక ప్రత్యేక పాత్రను పోషించిన నేపధ్యంలో అటు నాగ్ ఇటు వెంకటేష్ లు చైతన్య ‘ప్రేమమ్’ ఘన విజయానికి తమతమ స్థాయిలలో సహాయపడుతున్న నేపధ్యంలో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ వచ్చి చేరడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  ఈ దసరా రేస్ కు చాలా సినిమాలు  సందడి చేస్తున్నా యూత్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి అన్న ప్రచారం జరుగుతోంది. 
 
ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిన శృతి హాసన్ లక్ తో పాటు క్రేజీ హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్  మడోనాల  క్రేజ్ కూడ యూత్ ను ఈ ప్రేమముం ప్రదర్శిoచే థియేటర్స్ వైపు పరుగులు తీయిస్తుందని  ఈ సినిమా నిర్మాతలు బయ్యర్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే గతంలో ఇంచుమించు ‘ప్రేమమ్’ కథ పోలికతో వచ్చిన రవితేజ మూవీ ‘నా ఆటో గ్రాఫ్’ పెద్దగా విజయం సాధించని నేపధ్యంలో ‘ప్రేమమ్’  పట్ల తెలుగు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు అన్న అనుమానం ఈ సినిమాను భారీ మొత్తాలు పెట్టి  కొనుక్కున్న బయ్యర్లకు ఉన్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: