తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు చిక్కుల్లో పడిందట. తెలుగు లో హ్యాపీడేస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత అగ్ర హీరోల సరసన నటించింది. రామ్ చరణ్ తో నటించిన రచ్చ చిత్రం మంచి పేరు తెచ్చింది. గత సంవత్సరం విడుదలైన బాహబలి చిత్రంలో అవంతిక పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ అమ్మడికి ఒక్కసారే స్టార్ ఇమేజి బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగు,తమిళ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది మిల్కీబ్యూటి. ప్రస్తుతం తమన్నా ప్రభుదేవ సరసన ‘అభినేత్రి’ చిత్రంలో నటించింది.

అయితే తమన్నా నటించిన ధర్మ దురై’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది.  ఇక ఆ సమయంలో తమన్నా సినిమా ప్రమోషన్ కి ఏమాత్రం అటెండ్ కాలేదు..అంతే కాదు విజయోత్సవానికి ఒక్కసారి కూడా రాకపోవండంతో నిర్మాత అసహనానికి గురయ్యాడట.  హీరో విజయ్ సేతుపతి మాత్రమే ప్రమోషన్లలో పాలగోన్నాడు.

మరోవైపు అభినేత్రి చిత్రం కోసం తమన్నా విపరీతంగా ప్రమోషన్ చేయడంతో ధర్మ దురై’ చిత్ర నిర్మాతకు ఎక్కడో కాలింది. దీంతో తమిళనాడు నడిగర్ సంఘంలో తమన్నాపై తన సినిమాకి ప్రమోషన్ చేయలేదంటూ పిర్యాదు చేశాడు. అయితే విచారణ జరపాల్సిన నడిగర్ సంఘం సెక్రటరీ విశాల్ తమన్నాతో కలిసి ‘కత్తి సందై’ చిత్రంలో నటిస్తున్నారు.  మరి నడిగర్ అధ్యక్షుడు విశాల్ ఈ అంశంపై ఎలా స్పందిస్తాడో వేచి చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: