తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తెరపై దాదాపు పది సంవత్సరాల వరకు కనిపించకుండా పోయారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి అప్పట్లో మగధీర చిత్రంలో కొద్దిసేపు తనయుడితో కలిసి స్టెప్పులు వేస్తాడు. చాలా గ్యాప్ తర్వాత గత సంవత్సరం మళ్లీ రాంచరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రంలో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి ఫైట్ చేస్తాడు. దీంతో చిరంజీవిలో స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ప్రస్తుతం వివివినాయక్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’రిమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పేరు కూడా చిరంజీవికి కలిసి వచ్చిన సెంటిమెంట్ ‘ఖైదీ నెం.150’ అని పేరు పెట్టారు.  ప్రస్తుతం ‘ఖైదీ నెం. 150’షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
Image result for khaidi no.150 villion
ఆ మద్య హీరోయిన్ విషయంలో ఎన్నో సంచలన కథనాలు వచ్చినప్పటికీ కలువు కళ్ల బ్యూటీ కాజల్ ఫైనల్ అయ్యింది. ఇప్పటికే వీరిద్దరిపై షూటింగ్ తీయగా ఇప్పుడు సీన్ లోకి విలన్ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ నటుడు అయిన తరుణ్ అరోరా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం హీరో చిరంజీవి, విలన్ తరుణ్ అరోరాల మధ్యన ఆసక్తికర ఛాలెంజింగ్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో చిరు హీరోయిజం అదిరిపోయేలా ఉంటుందని టీమ్ చెబుతోంది.

Image result for khaidi no.150 villion
సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలన్న ఉద్దేశంతో టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది.వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.రైతుల సమస్యలను స్పృశించే ఓ బలమైన కథతో సినిమా తెరకెక్కుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: