ప్రస్తుతం ‘ ఓం నమో వెంకటేసాయా’ అంటూ హాదీరామ్ బాబా జీవితాన్ని తెరపైకి తీసుకు రావడానికి చాల కష్టపడుతున్న అక్కినేని నాగార్జున మరో సాహసోపేతమైన ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సాహసం నాగార్జున చేయగలిగితే ప్రస్థుత తరం టాప్ హీరోలలో ఎవరూ చేయని సాహసం చేసిన వ్యక్తిగా నాగార్జున రికార్డు క్రియేట్ చేయడం ఖాయం.

వెండితెర మన్మధుడుగా రొమాంటిక్ సినిమాలను ఎన్నో చేసిన నాగార్జున మధ్యలో తన గాడి తప్పి రొటీన్ కు భిన్నంగా ‘అన్నమయ్య’ ‘శ్రీరామదాసు’ సినిమాలతో పాటు షిరిడీ సాయిబాబా గా కూడ మెప్పించిన విషయం తెలిసిందే.  అయితే ఈమధ్యనే ‘ఊపిరి’ లాంటి డిఫరెంట్ సినిమాలో చక్రాల కుర్చీకి అతుక్కుపోయి అందర్నీ ఆశ్చర్య పరిచిన నాగార్జున త్వరలోనే గుడ్డి వాడిగా కనిపించడం ఖాయం అని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.

ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం  ఈమధ్య మాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న ప్రియదర్శన్ రామ్ డైరెక్షన్‌లో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘ఒప్పం’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి నాగార్జున చాల తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు టాక్. ఈ సినిమా కేరళాలో రిలీజ్ అయిన  మూడు వారాల్లో టాప్ కలెక్షన్లు సాధించి మాలీవుడ్ సూపర్ హిట్ గా నిలిచింది.  

ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగం అంతా  ఈ సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈసినిమాలో మోహన్ లాల్ మోహన్‌లాల్ కళ్లులేని గుడ్డి వాడుగా నటించాడు. 

ఒక లిఫ్ట్ ఆపరేటర్‌ గా పనిచేసే మోహన్ లాల్ తను పనిచేసే అపార్ట్‌మెంట్‌ లో జరిగిన హత్యకు సంబంధించి  కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు అన్నది ఈ సినిమా కథ ఈసినిమాలో మోహన్ లాల్ బ్లైండ్‌మ్యాన్‌గా నటించి మెప్పించిన తీరుతో  అతడికి మళ్ళీ జాతీయ అవార్డు వస్తుంది అంటూ మళయాళ మీడియా కామెంట్స్ వ్రాస్తోంది.  ఇటువంటి పాత్రలో తాను కష్టపడి నటిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా ? అన్న విషయమై నాగార్జున తన సన్నిహితుల అభిప్రాయాలను అడుగుతున్నట్లు టాక్. మరి నాగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: