ప్రభాస్ కు అరుదైన గౌరవం :


బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే.. అయితే ప్రభాస్ కెరియర్ లో ఊహించని రేంజ్లో క్రేజ్ సంపాదించగా ఇప్పుడు ప్రత్యేకంగా ఏ దక్షిణాది నటుడు అందుకోలేని అరుదైన గౌరవం ప్రభాస్ అందుకున్నాడు. బ్యాంకాక్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో ప్రభాస్ స్టాట్యూ ఉంచబోతున్నారు.


ఇప్పటికే మ్యూజియం టీం వచ్చి ప్రభాస్ ను 300 రకాల ఫోటోలను తీసి వాటితో పాటుగా కొలతలను కూడా తీసుకెళ్లారట. 2017 మార్చ్ నాటికి ఈ స్టాట్యూ తయారవబోతుంది. ఇక ప్రపంచమంతా ప్రదర్శన చేసి చివరకు మ్యూజియం లో ప్రదర్శనకు ఉంచుతారట. నరేంద్ర మోది తర్వాత అక్కడ ఏర్పాటు చేసే సెలబ్రిటీ ప్రభాస్ కావడం విశేషం.


నితిన్ చేతికి శాతకర్ణి రైట్స్ :


బాలకృష్ణ వందవ సినిమాగా రాబోతున్న ప్రతిష్టాత్మక సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి.. క్రిష్ డైరక్షన్లో రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా అదరగొడుతుంది. ఇక ఈ సినిమా నైజాం హక్కులను హీరో నితిన్ కైవసం చేసుకున్నాడట. అసియన్ సినిమాతో పోటీపడి మరి నితిన్ తన తండ్రి స్థాపించిన గ్లోబల్ మీడియా సంస్థ ద్వారా ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేయనున్నారు. 


అన్ని చోట్ల రికార్డు ప్రైజ్ తో అమ్ముడవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే బాలయ్య స్టామినా చూపిస్తుంది. క్రిష్ దర్శకత్వం మీద నమ్మకంతో పాటుగా చరిత్ర ను కథగా చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రిష్ ఇప్పటికే అన్ని వర్గాల సిని ప్రేక్షకుల నుండి అంచనాలను ఏర్పడేలా చేసుకున్నాడు. 


పవన్ త్రివిక్రం టైటిల్ ఫిక్స్ :


మాటల మాంత్రికుడు త్రివిక్రం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కలిసి మరో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. క్రేజీ కాంబినేషన్ గా రాబోతున్న ఈ సినిమా టైటిల్ గా దేవుడే దిగి వచ్చినా అని పెట్టబోతున్నారట. జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో హిట్ కాంబోగా వచ్చిన ఈ కలయిక మరోసారి జరగడం ఫ్యాన్స్ లో మంచి ఉత్సాహాన్ని తెచ్చింది.


ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ డిసెంబర్ కల్లా ఆ సినిమాను ముగించుకుని త్రివిక్రం సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కాటమరాయుడు సినిమా డాలి డైరక్షన్లో వస్తుంది.


ఫైట్ కోసం 3 కోట్లట :


సూపర్ స్టార్ మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబందించిన ఓ ఫైట్ సీక్వెన్స్ ను అత్యంత భారీగా 3 కోట్లతో షూట్ చేయనున్నారట. సినిమాలో హైలెట్ గా నిలవనున్న ఈ ఫైట్ కోసం చిత్రయూనిట్ పకడ్బందీ ప్లాన్ వేశారట. 


మహేష్ బాబు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా చేస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు





మరింత సమాచారం తెలుసుకోండి: