అల్లు అర్జున్ అభిమానులు మరో రెండున్నర నెలలు ఆగాలి. చాలాకాలం తరవాత బన్నీ చేస్తున్న ఆ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోంటే... అది వెనకడుగువేస్తోంది. అదే ఇద్దరమ్మాయిలతో. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో క్యాథరిన్, అమలాపాల్ కథానాయికలు. భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రానికి నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా పూరి జగన్నాథ్ ఏమడిగితే అది సమకూరుస్తున్నాడట గణేష్. ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి తీసుకెళ్తున్నాడట. ఈ సినిమాకి సుమారు 40 కోట్ల రూపాయల బడ్జెట్ అని అనధికారిక వర్గాల సమాచారం. అలా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీస్తున్న ఈ చిత్రం షూటింగ్ మాత్రం ఎప్పటికీ పూర్తికావడంలేదు. ఇప్పటివరకూ సగానికిపైనే అయిందని చెబుతున్నా సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి. అయితే, ఆ కన్ ఫ్యూజన్ కి తెరతీశాడు గణేష్. ఈ చిత్రాన్ని మే 10న విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించాడు. సో, ఇక విడుదల విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: