తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ తమ కుమారుడేనంటూ మధురై జిల్లాకు చెందిన దంపతులు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం జనవరి 12న స్వయంగా హాజరు కావాలని ధనుష్ కు సమన్లు జారీ చేసింది. మధురై జిల్లా మేలూరు సమీపంలోని ఆ.మలంపట్టికి చెందిన కదిరేశన్, మీనాళ్ దంపతులు మేలూరు మేజిస్ట్రేట్ కోర్టులో ఈ పిటిషన్ వేశారు.