అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఇద్దరమ్మాయిలతో..’. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేశముదురు సినిమా తరువాత ఈ ఇద్దరి కలయిలో వస్తున్న సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. ‘గబ్బర్ సింగ్’, ‘బాద్ షా’ ల నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మిస్తుండంతో ఈ ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ వేసవిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ ‘ఇద్దరమ్మాయిలతో..’ ఆడియోను ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఆడియోకు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: