‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్. ఆ తరువాత ఈ భామ కొన్ని తెలుగు సినిమాలలో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మ వివాదాల వ్యాఖ్యాలతోనే ఎక్కువగానే పాపులర్ అయింది. ప్రభాస్ అంటే ఎవరని..?, వెంకటేష్ తో నటించను అనే వ్యాఖ్యలతో ఆమె సినిమా పరిశ్రమలో కొంత మంది ఆగ్రహానికి కూడా గురయ్యింది. అలాగే ఇటీవల వచ్చిన ఇష్క్ సినిమాలో ఆమె నటించింది. ఈ సినిమా వరస పరాజయాల్లో ఉన్న నితిన్ కు మళ్ళీ విజయాన్ని అందించింది. దీంతో నిత్యామీనన్ పై సినిమా పరిశ్రమ దృష్టి పడింది. ఆమెకు మరన్ని ఛాన్సులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె మలయాళంలో నటించిన సినిమాను ‘దిల్ సే’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభించడం లేదు. కనీస ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. కేవలం నిత్యామీనన్ క్రేజ్ ను నమ్ముకుని విడుదల చేసిన ‘దిల్ సే’ సినిమా నిర్మాతకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: