టాలీవుడ్ లో ఇప్పుడు అందరీ దృష్టి అల్లు అర్జున్ పైనే ఉంది. అతను నటించిన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాను మే నెలలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడం ఒక విశేషమయితే... బండ్ల గణేష్ నిర్మించడ మరో విశేషం. ఇప్పుడు టాలీవుడ్ లో బండ్ల గణేష్  హావా నడుస్తుంది. ‘గబ్బర్ సింగ్’ తో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న గణేష్ తాజాగా ‘బాద్ షా’తోనూ అదే జోరు చూపించాడు. ఇప్పుడు ‘ఇద్దరమ్మాయిలతో..’నూ బండ్ల గణేష్ హిట్ కొడతాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ నెల 28న ‘ఇద్దరమ్మాయిలతో..’ ఆడియోను విడుదల చేస్తున్నారు. ఈ వేడుకను విశాఖపట్నంలో నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతుంది. గతంలోనూ కొన్ని సినిమా ఆడియో ఫంక్షన్లును విశాఖలో నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అయితే చివరకు హైదరాబాద్ లోనే వేడుకను నిర్వహించారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేస్తాడో చూడాలి. ‘ఇద్దరమ్మాయిలతో..’ ఆడియో వేడుకను అయినా విశాఖపట్నంలో నిర్వహిస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: