పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 18న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు, లోగో విడుదల చేసినప్పుడు పవన్ అభిమానులతో పాటు, చాలా మందిలో అనేక అనుమాలు వచ్చాయి. టైటిల్ అట్రాక్టివ్ గా లేదని, లోగో పాత మోడల్ లో, వంశీ సినిమాల తరహాలో ఉందని వ్యాఖ్యలు వచ్చాయి. అయితే సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండటం, సినిమాకు సంబంధించి వెలుగులోకి వస్తున్న ఒక్కొ విషయం ఆసక్తికరంగా ఉండటం వంటి కారణాలతో ఈ సినిమాపై అపోహలు తరిగిపోయి, అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా హక్కులను 2.5 కోట్లు చెల్లించి ఆర్.ఆర్ ఫిలిం డిస్ర్టిబ్యూటర్స్ దక్కించుకుందట. కాగా, ఈ సినిమా మొత్తంగా 50 కోట్ల రూపాయిల బిజినెస్ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: