ప‌వ‌న్ క‌ల్యాణ్ ది ల‌క్కీ హ్యాండ్ అయిపోయింది. ఇష్క్ ఆడియోకి వ‌చ్చి... నితిన్ కి హిట్ ఇచ్చారు. త‌న సినిమా పాట‌లోని ప‌దాన్ని ఇచ్చి... మ‌రో విజ‌యాన్ని అందించారు. దాంతో ప‌వ‌న్ ని గెస్ట్‌గా తీసుకొస్తే బాగుంటుంది.. అనే సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది. దాన్ని అల్లు అర్జున్ కూడా వాడుకోవాల‌ని చూస్తున్నాడు. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో ఆడియో విడుద‌ల వేడుక ఈనెల 28న హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళా వేదిక‌లో జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని అతిథిగా పిలిస్తే ఎలా ఉంటుంది? అని చిత్ర‌వర్గాలు భావిస్తున్నాయి. బ‌న్ని సినిమా జులాయికి కూడా ప‌వ‌న్ వెళ్లాడు. ఆ సినిమా హిట్ అయ్యింది. దాంతో ఈ సెంటిమెంట్‌పై గురి కుదిరింది. ఈ సినిమా నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా ప‌వ‌న్‌కి భ‌క్తుడే. ఆయ‌న కూడా ప‌వ‌న్‌కి ఈ ఫంక్ష‌న్‌ని తీసుకురావాల‌ని ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి భ‌క్తుల మాట‌... ప‌వ‌న్ కాదంటాడా?

మరింత సమాచారం తెలుసుకోండి: