అనుకొన్న‌ట్టుగానే ప‌విత్ర సినిమాని ఘూటు మ‌సాలాతో నింపేశాడు జ‌నార్థ‌న మ‌హర్షి. సెన్సార్‌కి దొర‌క‌ని డ‌బుల్ మీనింగ్ డైలాగులూ రాసేసి... కావ‌ల్సినంత మ‌సాలా అద్దాడు. శ్రియ క‌థానాయిక‌గా న‌టించిన సినిమా ఇది. ప్ర‌చార చిత్రాలు ఇప్పటికే కైపు ఎక్కిస్తున్నాయి. ఈ సినిమాలో ఏదో ఉంది.. అనే సంకేతాలు పంపాయి. అది సెన్సార్ రిపోర్టు అక్ష‌రాలా నిజం చేసింది.

ప‌విత్ర‌కు శుక్ర‌వారం సెన్సార్ జ‌రిగింది. ఈ సినిమాకి ఏ స‌ర్టిఫికెట్ అందించారు. క‌ట్స్ ఏమీ లేవు. ఈ సినిమాలో శ్రియ పాత్ర చూస్తే మ‌తిపోతోంద‌ట‌. బూతుని కూడా క‌నీక‌నిపించ‌కుండా.. బూతు అని తెలియ‌కుండా తెలివిగా చూపించాడట‌... జనార్థ‌న  మ‌హ‌ర్షి. ఈ ప‌విత్ర‌లో ఎన్ని వ‌న్నెచిన్నెలు ఉన్నాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: