అల్లు అర్జున్ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో సినిమా శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా అభిమానులు అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకుతగ్గట్లుగానే ఈ సినిమాకు రెండు రోజుల వరకూ అన్ని ప్రాంతాల్లోనూ టిక్కెట్ల బుకింగ్ పూర్తయ్యింది. గురువారం రాత్రి నుంచే చిత్రం బెనిఫిట్ షోలను ప్రదర్శిస్తున్నారు. అయితే, ఫిల్మ్ నగర్ నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తుంది. ఈ కొంతమంది ఈ సినిమాను సూపర్ హిట్ అంటుంటే మరికొంత మంది ఈ సినిమా అట్లర్ ఫ్లాఫ్ అని అంటున్నారు.

‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాలో అల్లు అర్జున్ ప్రదర్శన, అమలాపాల్, కేథరిన్ అందాలు, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయని అంటున్నారు. అయితే కథ, కథనాలు సరిగ్గా కుదరలేదని అంటున్నారు. ముఖ్చంగా పూరీ జగన్నాథ్ సినిమాకు ఆయవుపట్టు అయిన కామెడీ ఈ సినిమాలో చాలా డల్ గా సాగుతుందట. బ్రహ్మనందం, అలీ వంటి అతిరథమహరథులు ఉన్నా.. కామెడీని బ్రతికించలేకపోయారని అంటున్నారు. ఇద్దరమ్మాయిలతో సినిమాలోని కామెడీ ని చూస్తుంటే ఎక్కడో చూసినట్లు ఉంటుందని... మనం నవ్వుకోవాలే తప్ప పడిపడి నవ్వుకునేంత సీన్ సినిమాలో లేనది అంటున్నారు. ఇంటెర్వెల్ బ్లాంగ్ బావుందని అని అనిపించిన క్లైమాక్స్ తేలిపోయిందని అంటున్నారు.

అయితే మరికొంత మంది సినిమా సూపర్ హిట్ అని అంటున్నారు. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడని అంటున్నారు. అల్లు అర్జున్ ఖాతాలో మరో భారీ విజయం చేరుతుందని అంటున్నారు. 

మరి, ఇద్దరమ్మాయిలతో సినిమాపై అసలు టాక్ తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే...!

మరింత సమాచారం తెలుసుకోండి: