క‌థానాయ‌కుడి కంటే.. గాయ‌కుడిగానే త‌న శింబు బండి జోరుగా సాగుతోంది. వ‌రుస‌గా సినిమాల్లో పాట‌లు పాడేస్తున్నాడు. త‌న సినిమాల్లోనే కాదు. వాక్క‌వాళ్ల సినిమానీ వ‌ద‌ల్లేదు. మొన్నే ఎన్టీఆర్ బాద్షా సినిమాలో ఓ పాట పాడాడు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌లోనూ సింగేశాడు. ఇప్పుడు మ‌నోజ్ సినిమా పోటుగాడులోనూ ఇప్పుడు గ‌ళ‌మెత్తాడు. మ‌నోజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్ర‌మిది.

ఇందులో ఓ టీజింగ్ సాంగ్‌ని శింబు ఆల‌పించాడు. మ‌నోజ్ సినిమాలోపాట పాడ‌డం... శింబుకి ఇది రెండోసారి. గ‌తంతో నేను మీకు తెలుసాలోనూ ఓ పాట పాడాడు శింబు. అలా పోటుగాడు సినిమాలో పాట‌గాడుగా మారాడు ఈ త‌మిళ క‌థానాయ‌కుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: