చిరంజీవి ఖైదీ నెం. 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన తమ్ముడు నాగబాబు సృష్టించిన సునామీ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. నాగబాబు వ్యాఖ్యలతో వెంటనే సారీ ట్విట్టర్లో సారీ చెప్పేసిన వర్మ.. ఆ తర్వాత మళ్లీ మాట మార్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నాగబాబుపై ట్వీట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు.
చిరంజీవి ఫ్యాన్స్ డిజైన్ చేసిన పోస్టర్ అంటూ.. 'రౌడీ నెం.150' అనే ఒక పోస్టర్ను తన ట్విట్టర్లో వర్మ విడుదల చేశాడు. ఖైదీనంబర్ 150 పోస్టర్కు వర్మ ముఖాన్ని అతికించి.. మెగాస్టార్ అభిమానులు ఈ ఫొటోను తయారుచేశారంటూ చెప్పుకొచ్చాడు. మరొకటి అచ్చం ఖైదీ టైటిల్ లాగే ఉండేలా తయారుచేసి, చేతిలో కాఫీగ్లాసు పట్టుకుని దాన్ని ముఖానికి అడ్డుపెట్టుకుని బ్లాక్ అండ్ వైట్ ఫొటో పెట్టేశాడు.
ఖైదీ నెం.150 వేడుక సమయంలో వేదికమీద నుంచి నాగేంద్రబాబు స్పీచ్ లో వర్మను పేరు ప్రస్తావించకుండా చేసిన విమర్శలతో వర్మ బాగా షాక్ అయినట్టున్నాడు. దేవుడు చిరంజీవి కుటుంబంలో పవన్, చరణ్, సాయిధరమ్, వరుణ్, బన్నీ.. వీళ్లందరికీ చాలా సానుకూల లక్షణాలు ఇచ్చాడు గానీ, నాగబాబుకు మాత్రం బ్యాలెన్స్ ఇవ్వలేదని మరో ట్వీట్లో వర్మ కామెంట్ చేసాడు.
'తన కుటుంబంలోని పనికిమాలినవాళ్లను ప్రేమించడం వారినే విధ్వంసం చేస్తుంది' అని డామన్ వయాన్స్ అన్న మాటను వర్మ కోట్ చేశాడు. మళ్లీ తాజాగా.. నాగబాబు సార్ నిన్న అంతగా అరచి ఇవాళ ఇంత సైలంట్ గా ఉండటానికి కారణమేంటని ప్రశ్నించాడు. తేలు పిల్ల కుట్టిందా.. వాన పాము కరిచిందా అంటూ మరోసారి కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. అంతే కాదు గౌతమీ పుత్ర శాతకర్ణి మన సొంత టాలెంట్ అని.. ఖైదీ నెం 150 పొరుగు రాష్ట్రం టాలెంట్ అని కామెంట్ చేశాడు వర్మ.