తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని మెగాస్టార్ అయ్యారు.  దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఆయన వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో నటించారు. ఈ రోజు  ‘ఖైదీ నెంబర్ 150’ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం జరిగింది.  అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి పలు టీవి చానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో ఆయనతో ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజా కూడా ఓ చానల్ లో ఇంటర్వ్యూ తీసుకున్నారు.
Image result for khaidi no 150
 తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో రోజా ముఠామేస్త్రీ, బిగ్ బాస్, ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో జంటగాత నటించింది.  ఇక ఇంటర్వ్యూ తిసుకునే సమయంలో ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంది నటి రోజా.  చిరంజీవితో సినిమా చేస్తే బహుమతిగా సురేఖతో స్నేహం దొరుకుతుందని చెప్పింది.  సురేఖ కోసం ఒక రాత్రి సికింద్రాబాద్ లోని పారడైజ్ హోటల్ కి ముసుగులు వేసుకుని వెళ్లి, భోజనం చేసిన రోజులను గుర్తుచేసుకుంది.  ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తన సతీమణి సురేఖకు పారడైజ్ బిర్యాని అంటే ఎంతో ఇష్టమని అన్నారు.  

అంతే కాదు ప్రముఖ అందాల నటి శ్రీదేవి కి సురేఖ చేసే ఎండు చేపల కూర అంటేకూడా చాలా ఇష్టమని అన్నారు. ఇక శ్రీదేవి హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా తన ఇంటికి వచ్చి ఎండు చేపలకూర చాలా ఇష్టంగా తినడం అలవాటని అన్నారు.   ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనతో నటించిన ఎంతో మంది హీరోయిన్లకు సురేఖ మంచి స్నేహితురాలిగా మారిందని ఇంటర్వ్యూ సందర్భంగా అన్నారు.  పది సంవత్సరాల విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో నటిస్తున్నానని ఈ చిత్రంలో మాస్, క్లాస్, కామెడితో పాటు మంచి మెసేజ్ కూడా ఉందని అన్నారు.  

Image result for roja chiranjeevi


మరింత సమాచారం తెలుసుకోండి: