తెలుగు ఇండస్ట్రీలో దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు.  ఈ చిత్రం 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడం అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం జరిగింది.  దీంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం చిరు పై ప్రశంసల జల్లు కురిపించింది.  ఇక అభిమానుల ఆనందోత్సాలకు అంతే లేకుండా పోయింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఎక్కడ చూసినా చిరు మానియానే కనిపిస్తుంది.  ‘ఖైదీ నెంబర్ 150’ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఆ చిత్రం పై మంచు లక్ష్మీ ప్రసన్న కామెంట్ చేసింది .  
Image result for khaidi no 150 postes
ఇక మంచులక్ష్మి చేసిన కామెంట్స్ చూస్తే అందరూ షాక్ అవుతారు..ఖైదీ నెంబర్ 150 చిత్రంలో చిరంజీవి పెర్ఫార్మెన్స్ తో చింపేసాడట . చిరు చింపి ఫైడ్ అంటూ ట్వీట్ చేసి సంచలనం రేకెత్తించింది మంచు లక్ష్మి.  అంతే కాదు ఒక్క చిరంజీవినే కాదండోయ్..రాంచరణ్ తేజ్ ని కూడా పొగడ్తలతో ముంచెత్తింది .
Image result for khaidi no 150 postes
సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అందునా సందేశాత్మక చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అవడమే కాకుండా మా లాంటి వాళ్లని గర్వపడేలా చేసాడని చరణ్ కి కితాబు నిస్తోంది మంచు లక్ష్మీ. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తనలోని స్టామినీ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నారు.  

మంచు లక్ష్మి ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: