సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోలుగా వెలిగిపోయిన వారు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్లు గా మారిపోతున్నారు. ఈ సాంప్రదాయం హాలీవుడ్ స్థాయి నుంచి మొదలైంది. టాప్ హీరోలుగా వెలిగిపోయి..గొప్ప రెమ్యూనరేషన్ తీసుకున్న వారు సైతం సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ల అవతారం ఎత్తారు. తర్వాత ఈ సాంప్రదాయం బాలీవుడ్ కి పాకింది...చాలా మంది హీరోలు గత కొంత కాలంగా విలన్లు గా నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే..ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ విలనీజంతో ప్రారంభించారు.
లెజండ్ చిత్రంలో బాలయ్యకు పోటీగా ప్రతినాయకుడి పాత్రలో మెప్పించాడు. దీంతో హీరోగా కన్నా విలన్ గా ఎక్కువ చాన్స్ లు కొట్టేస్తున్నాడు జగపతిబాబు. త్వరలో ఈయన బాటలోనే శ్రీకాంగ్, రాజశేఖర్ లు కూడా నడవబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే బాటలో నడుస్తున్నాడు ఒకప్పటి అందగాడు, యాక్షన్ కింగ్ అర్జున్. తెలుగు, తమిళంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.
ఆ మద్య ఓ సినిమా అరవింద్ స్వామి,అర్జున్ నటించిన సినిమాలో విలన్ గా నటించినా అది పూర్తి స్థాయిలో కాదు..కానీ త్వరలో హీరో నితిన్ నటిస్తున్న సినిమాలో అర్జున్ విలన్ గా నటించడం విశేషం. గతంలో వీరిద్దరు కలిసిన నటించిన ‘శ్రీ ఆంజనేయం ’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. మొత్తానికి హీరోలు విలన్ గా మారగా తాజాగా అర్జున్ నితిన్ పాలిట విలన్ అయ్యాడు . హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ పతాకం పై తెరకెక్కనుంది .