బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం ఉంది.  ఫృథ్విరాజ్ కపూర్ వారసులుగా రాజ్ కపూర్, షమ్మీకపూర్ స్టార్ హీరోలుగా వెలిగిపోయారు. వారి వారసులు కూడా ఇండస్ట్రీలో పాపులర్ హీరోలుగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.  ఇక రాజ్ కపూర్ దర్శకులుగా కాకుండా ఎన్నో సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.  అలాంటి రాజ్ కపూర్ తనయుడు రిషికపూర్ తండ్రి పరువు తీశారు..ఇదే విషయం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది. వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ ప్రముఖ నటులు రిషీ కపూర్. "ఖుల్లం ఖుల్లా: రిషీకపూర్ అన్ సెన్సార్డ్" పేరుతో తన స్వీయచరిత్ర రాసిన రిషీ కపూర్ ప్రస్తుతం అందరి నోళ్ళల్లో నానుతున్నారు. విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు.

ఈ సందర్భంగా రిషీకపూర్  ఆత్మకథకు సంబంధించిన తొలి ప్రతిని వేంకటేశ్వరస్వామికి సమర్పించినట్టు ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ పుస్తకంలో పలువురు హీరోయిన్లతో రాజ్‌కపూర్‌కు ఉన్న అఫైర్లు, తదితర అనేక విషయాలను పుస్తకంలో పేర్కొనడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అలనాటి అందాల తార నర్గీస్‌దత్‌తో తన తండ్రికి ఉన్న ప్రేమ వ్యవహారంతో ఈ పుస్తకాన్ని ప్రారంభించడం గమనార్హం. 40, 50 దశకాల్లో ఆగ్, బర్సాత్, ఆవారా చిత్రాలతో వెండితెరపై రాజ్‌కపూర్, నర్గీస్ హిట్ జంటగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ బయోగ్రఫీలో సెలెబ్రిటీల ప్రవర్తనలతో పాటు వారి రాసలీలల గురించి చెప్పడమే కాకుండా మోస్ట్ వాంటెడ్ "అండర్ వరల్డ్ డాన్ దావూద్" ను తాను రెండుసార్లు కలిశానన్న విషయాన్ని బహిరంగంగానే సూటిగా చెప్పేశారు.
rishi kapoor
అయితే ఆ చరిత్రంతా ముంబై పేలుళ్లకు ముందే జరిగిందన్న విషయాన్ని కూడా వెల్లడించారు. ప్రస్తుతం రిషీ కపూర్ స్వీయ చరిత్రలో పేర్కొన్న అంశాలే బాలీవుడ్ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలు, మద్యం, కథానాయికలే తన తండ్రి ప్రపంచమని తన తండ్రి విషయాలు కూడా బహిరంగానే చర్చించారు. అంతే కాదు నర్గీస్, వైజయంతీమాల, మధుబాల, జీనత్ ఆమన్, డింపుల్ కపాడియా, సిమి గ్రేవల్, మందాకిని, పద్మిని తదితర హీరోయిన్లతో తన తండ్రి కున్న సంబంధాల గురించి రాయటంతో ఆయన పుస్తకంపై భారీ చర్చలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం రిషీ కపూర్ స్వీయచరిత్రకు సంబంధించిన రాతలపైనే చర్చ జోరుగా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: