టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాహీరోల ఫిల్మ్ కెరియర్స్ కి వెన్నుముగా ఉండటంలో కీలక పాత్ర అల్లుఅరవింద్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా రామ్ చరణ్ కెరీర్ లోనూ అల్లుఅరవింద్ పాత్ర ఎంతో కీలకం అయింది. అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ పై అల్లుఅరవింద్ సీరియస్ అవుతున్నాడనే న్యూస్ అంతటా వినిపిస్తుంది. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనికి సంబంధించిన న్యూస్ హాట్ టాక్స్ గా వినిపిస్తున్నాయి.
వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగానే కాకుండా...నిర్మాతగానూ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ మెగాహీరోల సొంత బ్యానర్ అంటే గీతా ఆర్ట్స్ అని మాత్రమే అందరికి తెలుసు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అంటూ కొత్త బ్యానర్ క్రియేట్ చేసి...సొంతంగా సినిమాలను నిర్మిస్తున్నారు.
అలా కొణిదెల ప్రొడక్షన్స్ నుండి వచ్చిన మొదటి మూవీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’. రామ్ చరణ్ నిర్మాతగా చేసిన మొదటి చిత్రమే ‘ఖైదీ నంబర్ 150’తనకి దాదాపు 30 కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టిందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. అలాగే ఇప్పుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మెగాస్టారో మరో సినిమాకి ప్లాన్ చేశారు. ఈ మూవీకి సైతం రామ్ చరణ్ నిర్మాతగా ఉంటున్నారు. దాదాపు కొణిదెల ప్రొడక్షన్స్ లోనే చిరంజీవికి సంబంధించిన వరుస 3 సినిమాలను చరణ్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు చిరుకి సంబంధించిన 152వ మూవీని అల్లుఅరవింద్ గీతా ఆర్ట్స్ లో ప్లాన్ చేయాలని చూస్తున్నారు. చరణ్ అందుకు అంగీకరించకపోవటంతో అల్లుఅరవింద్ కొంత అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ లో చిరు మూవీకి చరణ్ ఛాన్స్ ఇవ్వకపోవటంతో లాభాలన్నీ చరణ్ ఒక్కడే తీసుకుంటున్నాడే అనే ఆలోచన అల్లుఅరవింద్ లో ఉందట. అయితే చరణ్ నిర్మాతగా ఎదుగుతున్న తీరుపై అల్లుఅరవింద్ ఫుల్ హ్యీపీగా ఉన్నాడని అంటున్నారు.