టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన భారీ చిత్రాల్లో దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వచ్చిన ‘శతమానం భవతి’ మూవీ కూడ ఉంది. కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తూ వరుస సక్సెస్ లను అందుకుంటున్న హీరో శర్వానంద్‌. ఇక శర్వానంద్‌ తాజాగా నటించిన ‘శతమానం భవతి’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని సాధించిందనే విషయం తెలిసిందే. 

‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి రెండు భారీ సినిమాల మధ్య వచ్చినా ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీ లాభాల పట్టడానికి కొంత ఎక్కువ సమయమే తీసుకుంది. చిరు నటించిన ఖైదీ నెం.150, బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలకి ఎక్కువ థియోటర్స్ ఉండటంతో ‘శతమానం భవతి’ చిత్రానికి తక్కువ థియోటర్స్ సొంతం అయ్యాయి.

దీని కారణంగా ‘శతమానం భవతి’ చిత్రానికి లాభాలు రావటానికి ఎక్కువ సమయం పట్టింది. నిజానికి ఈ మూవీ ఇప్పటికే 8 కోట్ల రూపాయల లాభాలను చూడాల్సి ఉంది. కానీ థియోటర్స్ తక్కువుగా దొరికిన సందర్భంగా ఇప్పటి వరకూ 2 కోట్ల రూపాయలను మాత్రమే కలెక్షన్స్ రూపంలో లాభాన్ని చూసింది. దిల్ రాజు అనుకున్నదాని కంటే ఈ అమౌంట్ చాలా తక్కువ.

దిల్ రాజు ఎక్స్ పెక్ట్ చేసిన దాంతో పోలిస్తే ‘శతమానం భవతి’ మూవీకి 4 కోట్ల రూపాయలు నష్టం ఉందని అంటున్నారు. అయితే ఇది లాభాల్లో తగ్గిన నష్టం కానీ...అసలు నష్టం కాదని ట్రేడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈవారం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో లాంగ్‌రన్‌లో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: