రెండు భారీ సినిమాల మధ్య తాను నిర్మించిన ‘శతమానం భవతి’ ని విడుదల చేసి ఆ భారీ ఫైట్ మధ్య హిట్ అందుకోవడంతో మంచి జోష్ మీద ఉన్నాడు దిల్ రాజ్.  టాలీవుడ్ సినిమా రంగంలో ఏమాత్రం పేరు లేని రచయిత మరియు దర్శకుడు సతీష్ వేగ్నిశకు అవకాశం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో అతి చిన్న సినిమాగా పేరు వచ్చినా  విడుదలకు ముందే బ్రహ్మాండంగా టేబుల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్నాడు దిల్ రాజ్.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమాకు సంబంధించి నైజాం, వైజాగ్ కలిసి అప్పుడే 5 కోట్ల వరకు నెట్ కలక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  దీనితో మరింత జోష్ లోకి వెళ్ళిపోయిన ఈ నిర్మాత ఈసినిమాకు మరింత క్రేజ్ తీసుకు రావడానికి ఒక భారీ ప్రమోషన్ కార్యక్రమాన్ని ఈ నెల 27 లేదా 28న ఏర్పాటు చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

తన సినిమా కెరియర్ లోనే అత్యంత భారీ సభగా ఈ కార్యక్రమాన్ని దిల్ రాజ్ డిజైన్ చేస్తున్నట్లు టాక్. ఈ కార్యక్రమంలో వంద మంది దంపతులకు సన్మానం చేస్తే ఎలా ఉంటుంది అన్న  ఆలోచనలు చేస్తున్నాడట దిల్ రాజు.

అయితే ఆ దంపతులు ఎవరు వార్ని ఎలా ఎంపిక చేస్తారు అనే విషయమై ప్రస్తుతానికి సస్పెన్స్ కొన సాగుతోంది.  చిన్న సినిమాలను ముఖ్యంగా ఫీల్ గుడ్ మూవీలను తీయడంలో మంచి నేర్పరిగా పేరుగాంచిన దిల్ రాజ్ ఇప్పుడు ఈ 100 దంపతుల సన్మాన కార్యక్రమంతో మరో కొత్త రికార్డు కోసం కన్నేశాడు అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: