మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 డైరక్టర్ గా వినాయక్ మరోసారి తన సత్తా చాటాడు. దర్శకుడిగా ఫ్లాపుల్లో ఉన్నా సరే వినాయక్ కు పిలిచి మరి అవకాశం ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇచ్చిన అవకాశాన్ని అన్నివిధాలుగా వాడుకుని సినిమా సక్సెస్ కు కారణమయ్యాడు వినాయక్. అయితే ఇప్పుడు ఈ మెగా డైరక్టర్ తో మెగా మూవీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్. 


ఎంట్రీ ఇచ్చిన మూడు సినిమాలకే మెగా స్టామినా ఏంటో చూపించిన తేజు లాస్ట్ ఇయర్ సుప్రీం తో హిట్ అందుకున్నా తిక్కతో పెద్ద షాక్ తిన్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరక్షన్లో విన్నర్ మూవీ చేస్తున్న సాయి ధరం తేజ్ తన తర్వాత మూవీ నిర్మాత ఎవరైనా సరే వినాయక్ డైరక్షన్లోనే అంటూ చెబుతున్నాడు. హీరోలకు మాస్ ఇమేజ్ ఇచ్చే వి.వి.వినాయక్ డైరక్షన్లో తను నటించాలని ఉంది అంటూ తన కోరిక బయటపెట్టాడు తేజు. 


ఇక అలా అన్నాడో లేదో వినాయక్ తర్వాత సినిమా తేజు హీరోగానే ఉంటుందని అంటున్నారు. నిర్మాత ఎవరు కాస్ట్ అండ్ క్రూ ఏంటి అన్నది తెలియదు కాని మెగాస్టార్ చిరంజీవి తర్వాత మెగా మేనళ్లుడిని డైరెక్ట్ చేయబోతునాడు వినాయక్. మరి వినాయక్ తేజు కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం విన్నర్ టీజర్ తో మెగా అభిమానులను అలరిస్తున్న సాయి ధరం తేజ్ ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకునేలా ఉన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: