సుబ్బిరామిరెడ్డి - ఈ పేరు గ్లామర్ కే గ్లామర్. సినిమా ప్రపంచానికి అతిసన్నిహితుడు శ్రేయోభిలాషి. ఒక దశాబ్ధం సుదీర్ఘ విరామం తరవాత చిరంజీవి నటించిన ఖైది నంబర్ 150 అద్భుత విజయం సాధించిన సంధర్భంగా "ఆత్మీయవేడుక" తో చిరంజీవిని సినిమా రంగాన్ని సత్కరించారు. ఆసంధ్ర్భంగా మాట్లాడుతూ :
20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అదే ఉత్సాహం ఇప్పటికీ చిరంజీవిలో కనిపిస్తున్నది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం అని అన్నారు టి.సుబ్బిరామిరెడ్డి. దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే విడుదలైన ఖైదీ నంబర్ 150 తో పునరాగమనం చేశారు చిరంజీవి.ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో ఆత్మీయవేడుక పేరుతో చిరంజీవిని సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ చిరంజీవి తిరిగిసినిమాల్లో నటించడం ఆనందంగా ఉంది. ఆయనతో గతంలో నేను నిర్మించిన స్టేట్రౌడీ చిత్రం పలు రికార్డు లను నెలకొల్పింది. "చిరంజీవి, పవన్కల్యాణ్, రామ్చరణ్, అల్లుఅర్జున్" ల కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మాత అశ్వినీదత్ తో కలిసి నిర్మిస్తాను. త్వరలో మెగా హీరోలందరిని వ్యక్తిగతంగా కలవబోతున్నాను. అలాగే బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రాతో కలిసి తెలుగులో సినిమాల్ని నిర్మించే ఆలోచనలో ఉన్నాను అని తెలిపారు.